గోత్రం పేరుతో కూతురి గొంతు కోశారు
ప్రేమ వివాహం చేసుకున్నందుకు హత్యలు చేసిన ఘటనలు చూశాం. కులం, మతం, ఆస్తి, అంతస్తు కారణంతోనూ ప్రాణాలు తీసిన వార్తలు చదివాం. తాజాగా.. ఒకే గోత్రం ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకున్నందుకు ప్రాణాలు కోల్పోయిందో యువతి.
దిల్లీ: ప్రేమ వివాహం చేసుకున్నందుకు హత్యలు చేసిన ఘటనలు చూశాం. కులం, మతం, ఆస్తి, అంతస్తు కారణంతోనూ ప్రాణాలు తీసిన వార్తలూ చదివాం. తాజాగా.. ఒకే గోత్రం ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకున్నందుకు ప్రాణాలు కోల్పోయిందో యువతి. అదీ ఆమె తల్లిదండ్రుల చేతుల్లో కావడం గమనార్హం. తూర్పు దిల్లీలో పాల వ్యాపారం చేసే రెండు కుటుంబాలు పక్కపక్కనే నివాసం ఉండేవి. దీంతో శీతల్ చౌదరి, అంకిత్ అనే యువతీ యువకులు ప్రేమించుకుని మూడు సంవత్సరాల పాటు రహస్యంగా సహజీవనం చేశారు. ఈ క్రమంలో గత అక్టోబర్లో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. పెళ్లయితే చేసుకున్నారు కానీ, వాళ్లిద్దరూ వాళ్ల కుటుంబాలతోనే వేర్వేరుగా ఉన్నారు.
ఆ తర్వాత జరిగిన విషయాన్ని యువతి తన తల్లిదండ్రులకు చెప్పడంతో ఇంట్లో వాళ్లు అభ్యంతరం చెప్పారు. అర్థం చేసుకోవడం పక్కనుంచితే.. కర్కశంగా ప్రవర్తించారు. కన్న కూతరని కూడా చూడకుండా గొంతు కోసి చంపేశారు. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని మాయం చేసేందుకు కారులో తూర్పు దిల్లీ నుంచి దాదాపు 80 కిలోమీటర్లకు పైగా ప్రయాణించి ఉత్తర్ప్రదేశ్లోని సికంద్రాబాద్కు చేరుకుని కాలువలో మృతదేహాన్ని విసిరేసి వెళ్లిపోయారు.
ఇదంతా తెలియని అంకిత్. తన భార్య కనిపించకపోవంతో కంగారుపడి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తమ అత్తమామలపై అనుమానం వ్యక్తం చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను విచారించారు. దీంతో అసలు విషయం బయటికొచ్చింది. నేరానికి పాల్పడ్డ వారితో పాటు అందుకు సహకరించిన వారందరినీ దిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒకే గోత్రం ఉన్న అబ్బాయిని పెళ్లి చేసుకున్నందుకే హతమార్చినట్లు ఆ తల్లిదండ్రులు ఒప్పుకొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దర్యాప్తు బృందం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు నమోదు చేసింది. -
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో నాలుగు రోజుల క్రితం మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అనుచరుడి వద్ద భారీగా మద్యం స్వాధీనం చేసుకున్న ఘటన మరువక ముందే తాజాగా పొదలకూరు మండలం విరువూరులో మరో అనుచరుడు చిర్రా రాజగోపాల్రెడ్డి రైస్మిల్లులో మద్యం నిల్వలను బుధవారం సెబ్, పోలీసు అధికారులు సీజ్ చేశారు. -
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. -
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
సూర్యాపేట జిల్లా కోదాడలో జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సు బోల్తా
లక్షలాది కి.మీ. తిరిగిన బస్సులను స్క్రాబ్కు పంపకుండా రోడ్లపైకి పంపడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్లే. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం.. ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. -
పల్నాడులో తెదేపా కార్యకర్తలపై.. వైకాపా వర్గీయుల దాడి
`పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లలో వైకాపా వర్గీయుల దాడిలో తెదేపాకు చెందిన నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. -
గుంతలో పడి.. ఏకే 47 పేలి.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని 81 బెటాలియన్ బేస్ క్యాంపు పరిధిలో బుధవారం ఏకే-47 తుపాకి ప్రమాదవశాత్తు పేలడంతో విధుల్లో ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ ఎంవీ శేషగిరి(47) మృతి చెందారు. -
ఇంటర్లో ఫెయిలైన ఏడుగురు విద్యార్థుల బలవన్మరణం
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామని మనస్తాపంతో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా