నగ్నంగా నృత్యం చేయాలంటూ మహిళపై దాడి!

నగ్నంగా నృత్యం చేయాలని బెదిరిస్తూ ఒక మహిళపై నలుగురు యువకులు దాడి చేసిన ఘటన హైదరాబాద్‌ శివారు రాజేంద్రనగర్‌ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏసీపీ అశోక్‌ చక్రవర్తి...

Updated : 27 Feb 2020 00:53 IST

రాజేంద్రనగర్‌లో ఘటన.. కేసు నమోదు

రాజేంద్రనగర్‌: నగ్నంగా నృత్యం చేయాలని బెదిరిస్తూ ఒక మహిళపై నలుగురు యువకులు దాడి చేసిన ఘటన హైదరాబాద్‌ శివారు రాజేంద్రనగర్‌ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏసీపీ అశోక్‌ చక్రవర్తి తెలిపిన వివరాల ప్రకారం రాజేంద్రనగర్‌ ఠాణా పరిధిలో నివసించే ఓ మహిళ ఈవెంట్‌ ఆర్గనైజర్‌గా పనిచేస్తోంది. పుట్టినరోజు వేడుకలకు సంబంధించి ఏర్పాట్లు చేయాలని అమీర్‌ అనే యువకుడు సదరు మహిళను సంప్రదించాడు. ఈనెల 22న రాత్రి పుట్టినరోజు వేడుకలు జరిగాయి. రాత్రి వేడుకలు ముగిసిన తర్వాత మద్యం సేవించిన అమీర్‌, అతడి మిత్రులు సుల్తాన్‌, సలీమ్, రాజ్‌అలీ నగ్నంగా నృత్యం చేయాలంటూ మహిళను బలవంతపెట్టారు. ఆమె నిరాకరించటంతో కత్తులతో బెదిరించి గదితో బంధించారు. నృత్యం చేయాల్సిందేనంటూ ఆమెపై దాడి చేశారు. రాత్రంతా గదిలోనే ఉన్న సదరు మహిళ 23వ తేదీ తెల్లవారుజామున వారి నుంచి తప్పించుకుని బయటకు వచ్చింది. అనంతరం తన భర్తతో కలిసి రాజేంద్రనగర్‌ ఠాణాలో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు యువకులు కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని