వరుని వక్రబుద్ధి
చేసుకున్న వివాహ నిశ్చితార్థం రద్దు చేసుకున్నారన్న కక్షతో యువతిపై సామాజిక మాధ్యమాల్లో అసభ్య పోస్టులు పెడుతున్న యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను సీఐ బీబీ.రవికుమార్ అవనిగడ్డ పోలీస్ స్టేషన్లో బుధవారం వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం అవనిగడ్డ పోలీస్ స్టేషన్ పరిధిలోని యువతితో గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన విజయభాస్కర్తో ఇటీవల వివాహ నిశ్చితార్థమైంది.
నిశ్చితార్థం రద్దు చేసుకున్నారన్న కక్షతో అసభ్య పోస్టులు
యువతి ఫిర్యాదుతో అరెస్టు
అవనిగడ్డ: చేసుకున్న వివాహ నిశ్చితార్థం రద్దు చేసుకున్నారన్న కక్షతో యువతిపై సామాజిక మాధ్యమాల్లో అసభ్య పోస్టులు పెడుతున్న యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను సీఐ బీబీ.రవికుమార్ అవనిగడ్డ పోలీస్ స్టేషన్లో బుధవారం వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం అవనిగడ్డ పోలీస్ స్టేషన్ పరిధిలోని యువతితో గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన విజయభాస్కర్తో ఇటీవల వివాహ నిశ్చితార్థమైంది. అనంతరం కాబోయే భర్తతో ఆమె చనువుగా ఉంటున్న దానిని ఆసరా చేసుకొని యువతి పట్ల అతను అసభ్యంగా ప్రవర్తించేవాడు. అసభ్య చిత్రాలను చిత్రీకరించాడు. తన అవసరాలు తీర్చమని ఒత్తిడి తెచ్చాడు. ఈ నేపథ్యంలో అతని ప్రవర్తన బాగుండ లేదని యువతి తల్లిదండ్రులు గమనించి చేసుకున్న నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నారు. దీంతో కక్ష కట్టిన నిందితుడు ఆమెతో సన్నిహితంగా ఉన్నప్పుడు తీసిన చిత్రాలతో అప్పటికే ఆమె పేరుతో తెరిచిన ఫేస్బుక్లో అసభ్య పోస్టులు పెడుతున్నాడు. ఆమె పేరుతో క్రియేట్ చేసిన మెయిల్ ద్వారా ఆమె పరిచయస్థులకు చిత్రాలను పంపుతున్నాడు. దీంతో తల్లిదండ్రులతో కలిసి యువతి ఈనెల 18న పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు నూతన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి నిందితుడు విజయభాస్కర్ను గుర్తించి బుధవారం అరెస్టు చేసినట్లు సీఐ చెప్పారు. నిందితుడిని సైబర్ సెక్షన్ల కింద అరెస్టు చేసి, అసభ్యంగా చిత్రీకరించిన చిత్రాలను, ఫోన్ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. విలేకరుల సమావేశంలో ఎస్ఐలు సందీప్, సురేష్ పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫొటోకు పోజులిస్తూ... అగ్నిపర్వతంలో జారిపడిన పర్యటకురాలు
చైనాకు చెందిన ఓ మహిళ(31) అగ్నిపర్వతం అంచున ఫొటో తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు అందులో పడి మరణించిన ఘటన ఇండోనేషియాలో చోటుచేసుకుంది. -
మానేరు వాగుపై కూలిన నిర్మాణంలోని వంతెన
పెద్దపల్లి జిల్లాలో మానేరు వాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోయింది. ముత్తారం మండలం ఓడేడు పరిధిలో సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. -
సస్పెన్షన్కు గురైన సబ్రిజిస్ట్రార్ ఇంట్లో అనిశా తనిఖీలు.. రూ. 10 కోట్ల ఆస్తుల గుర్తింపు
మహబూబాబాద్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో గత నెల 22న లంచం తీసుకుంటూ అవినీతి నిరోధకశాఖ అధికారులకు చిక్కిన సబ్రిజిస్ట్రార్ తస్లీమ మహ్మద్ ఇంట్లో అధికారులు సోమవారం మరోసారి తనిఖీలు నిర్వహించారు. -
యూసఫ్గూడలో అగ్నిప్రమాదం.. 20 కార్లు దగ్ధం!
యూసఫ్గూడలో అగ్నిప్రమాదం జరిగింది. అక్కడి గణపతి కాంప్లెక్స్లో సెకండ్ హ్యాండ్ కార్లు విక్రయించే చోట ఈ ఘటన చోటుచేసుకుంది. -
చదువుపై మక్కువతో నవ వధువు బలవన్మరణం
ఉన్నత చదువులు చదువుకుంటానని చెప్పినా కుటుంబసభ్యులు వివాహం చేయడంతో నవ వధువు పురుగుమందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం మంగయ్యబంజర్ గ్రామంలో చోటుచేసుకుంది. -
మహిళపై అమానుషానికి పాల్పడింది సంగారెడ్డి యువకులు!
మహిళపై పాశవికంగా అత్యాచారానికి పాల్పడి ఆమె మృతికి కారణమైన కేసులో పోలీసులు నిందితులను గుర్తించినట్లు తెలిసింది. -
ఏపీలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వైకాపా నాయకుడి అరెస్టు
కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వైకాపా నాయకుడు బోయ మహానందిని మూడో పట్టణ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. -
మంచులో కూరుకుపోయి తెలుగు వైద్య విద్యార్థి మృతి
వైద్య విద్య కోసం కిర్గిజ్స్థాన్ వెళ్లిన తెలుగు విద్యార్థి అక్కడి జలపాతం సందర్శనకు వెళ్లి మృత్యువాత పడ్డాడు. ఈ విషాదకర ఘటన ఆదివారం చోటుచేసుకుంది. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. -
మూడు పదులు నిండకుండానే ముగిసిన జీవితాలు
పట్టుమని 30 ఏళ్లు కూడా నిండలేదు.. రెండేళ్ల కిందటే వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు. భవిష్యత్తుపై ఎన్నో కలలు కంటూ.. ఆనందంగా జీవిస్తున్న ఆ దంపతుల ఆశలు అర్ధంతరంగా ఆవిరైపోయాయి. -
పంట నష్టాలతో రైతు ఆత్మహత్య
మహబూబాబాద్ జిల్లా మరిపెడ శివారు మాకుల తండాలో ఇస్లావత్ చీనా(42) అనే రైతు సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. వ్యవసాయంలో నష్టం, ఆర్థిక సమస్యలతో బలవన్మరణానికి పాల్పడ్డారు. -
రాళ్లు విసిరి.. జెండా కర్రలతో కొట్టి
తెదేపా ఎస్సీ కార్యకర్తలపై వైకాపా శ్రేణులు దాడికి పాల్పడిన ఘటన పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో చోటుచేసుకుంది. బాధితుల వివరాల ప్రకారం.. సత్తెనపల్లి నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ సోమవారం నామినేషన్ వేశారు. -
పల్నాడు జిల్లాలో తెదేపా కార్యాలయానికి నిప్పు
పల్నాడు జిల్లాలో వైకాపా నాయకులు ప్రతిపక్షాలపై దాడులకు తెగబడుతున్నారు. ఆదివారం రాత్రి బెల్లంకొండ మండలం నాగిరెడ్డిపాలంలో తెదేపా కార్యాలయం వద్ద తాటాకు పందిరికి నిప్పు పెట్టారు.
తాజా వార్తలు (Latest News)
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM