కరీంనగర్‌లో బాలికపై సామూహిక అత్యాచారం!

తొమ్మిదేళ్ల బాలికపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన..

Published : 27 Feb 2020 18:04 IST

కరీంనగర్‌: తొమ్మిదేళ్ల బాలికపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన కరీంనగర్‌లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మూడు రోజుల క్రితం వినీశ్, శ్రీనివాస్‌, రవితేజ అనే యువకులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు నిందితుల్లో ఓ మైనర్‌ ఉన్నట్లు మూడో పట్టణ పీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ విజ్ఞాన్‌రావు తెలిపారు. పరారీలో ఉన్న ముగ్గురి కోసం గాలిస్తున్నామని ఆయన వెల్లడించారు. చికిత్స నిమిత్తం బాలికను ఆస్పత్రికి తరలించామన్నారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని