తుపాకితో కాల్చుకుని వైద్యుడి ఆత్మహత్య
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా జవహర్నగర్ ఠాణా పరిధిలో ఒక వైద్యుడు తుపాకితో కాల్చుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. జవహర్నగర్ ఇన్స్పెక్టర్ భిక్షపతిరావు కథనం ప్రకారం.. సిద్దిపేట జిల్లాకు చెందిన వైద్యుడు రవీంద్రకుమార్
కుటుంబ కలహాలే కారణమా?
జవహర్నగర్: మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా జవహర్నగర్ ఠాణా పరిధిలో ఒక వైద్యుడు తుపాకితో కాల్చుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. జవహర్నగర్ ఇన్స్పెక్టర్ భిక్షపతిరావు కథనం ప్రకారం.. సిద్దిపేట జిల్లాకు చెందిన వైద్యుడు రవీంద్రకుమార్ (44), భార్య స్మిత, కుమారుడు ఆదిత్య (11)తో కలిసి సాకేత్లోని మిథిలా విల్లా 57లో నివసిస్తున్నారు. దంపతులిద్దరూ వైద్యులే. దమ్మాయిగూడ పురపాలిక పరిధిలో వీరు 2015 నుంచి శ్రీ ఆదిత్యా ఆసుపత్రి నిర్వహిస్తున్నారు. ఇంటికీ, ఆసుపత్రికీ మూడు కి.మీ. దూరం ఉంటుంది. ఆదివారం రాత్రి భార్యాభర్తల మధ్య స్వల్ప వివాదం జరగడంతో ఆమె కుమారుడిని తీసుకుని దిల్సుఖ్నగర్లోని తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లారు. స్మిత సోదరి స్వప్న కూడా వీరి ఆసుపత్రిలోనే పనిచేస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట వరకూ రవీంద్ర ఆసుపత్రికి రాకపోవడంతో స్మిత ఆయనకు ఫోన్ చేశారు. అయినా స్పందన లేకపోవడంతో ఆమె రవీంద్ర ఇంటికి వచ్చి చూశారు. ఆయన తన గదిలో మంచంపై రక్తపుమడుగులో పడి ఉండడంతో పోలీసులకు, కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. సంఘటనస్థలానికి చేరుకున్న కుషాయిగూడ ఏసీపీ శివకుమార్, జవహర్నగర్ ఇన్స్పెక్టర్ భిక్షపతిరావు వివరాలు ఆరా తీశారు. మృతదేహం పక్కనే తుపాకి, మూడు బుల్లెట్లను గుర్తించారు. మృతికి కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. రవీంద్రకుమార్కు ఆర్థిక ఇబ్బందులు లేవని కుటుంబ సభ్యులు తెలిపినట్లు సమాచారం. ఆయన సోదరి శశికళ ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గతంలో మాజీ నక్సలైట్లు కొందరు రవీంద్రను డబ్బుల కోసం బెదిరించగా, వారిని ఆయన పోలీసులకు పట్టించారు. అప్పుడే ఆత్మరక్షణ కోసం లైసెన్స్డ్ తుపాకీ తీసుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్పై రాయిదాడి కేసు.. సతీష్ కస్టడీకి కోర్టు అనుమతి
సీఎం జగన్పై గులకరాయి కేసులో అరెస్టయి రిమాండ్లో ఉన్న నిందితుడు సతీష్ కుమార్ను కస్టడీకి అనుమతిస్తూ విజయవాడ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ప్రమాదవశాత్తు పేలిన ఏకే 47.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
ప్రమాదవశాత్తు తుపాకీ పేలడంతో సీఆర్పీఎఫ్కు చెందిన అసిస్టెంట్ కమాండెంట్ శేషగిరిరావు మృతిచెందారు. -
శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో ముగ్గురి అరెస్ట్
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో అనిశా మరో ముగ్గురిని అరెస్టు చేసింది. ఆయన ఆస్తులకు బినామీలుగా ఉన్న వ్యాపారులు గోదావర్తి సత్యనారాయణమూర్తి(62), పెంట భరత్కుమార్(30), ప్రైవేటు ఉద్యోగి పెంట భరణికుమార్(30)ను వ్యవహరిస్తున్నట్లు గుర్తించింది. -
నూడుల్స్ ప్యాకెట్లలో వజ్రాలు
నూడుల్స్ ప్యాకెట్లలో దాచిపెట్టిన వజ్రాలు, ప్రయాణికుల శరీర భాగాల్లో, బ్యాగేజీలో ఉంచి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని ముంబయి విమానాశ్రయంలో కస్టమ్స్ విభాగం స్వాధీనం చేసుకుంది. -
వైకాపా నాయకుడి ఇంట్లో 384 మద్యం సీసాలు
శ్రీకాకుళంలోని కత్తెరవీధికి చెందిన వైకాపా నాయకుడు పైడి మహేశ్వరరావు నివాసంలో దాచి ఉంచిన 384 మద్యం సీసాలను టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. -
ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురికి గాయాలు
ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయిన బస్సు అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన ఘటన సూర్యాపేట జిల్లా మునగాలలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. -
అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్యాయత్నం
అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆ దంపతులు వాటిని తీర్చే దారిలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా భర్త మృతి చెందారు. ఈ విషాదకర ఘటన పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం పారుపల్లిలో జరిగింది. -
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
హైదరాబాద్ నగరంలోని యూసఫ్గూడలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక యువతిపై బస్సు ఎక్కడంతో తీవ్రగాయాలతో ఆమె మృతిచెందింది.