యూపీలో చిన్నారిపై హత్యాచారం

అత్యాచారానికి గురయిన ఉత్తర్‌ ప్రదేశ్‌ మైనర్‌ బాలిక, చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది.

Published : 13 Mar 2020 01:23 IST

చికిత్స పొందుతూ బాలిక మృతి

ఉన్నావ్‌: అత్యాచారానికి గురైన ఉత్తర్‌ప్రదేశ్‌ మైనర్‌ బాలిక, చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. ఈ దారుణ సంఘటన యూపీలోని ఉన్నావ్‌ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి...
బిహార్‌ పట్టణ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఓ గ్రామంలో మంగళవారం హోలీ సంబరాలు జరుగుతున్నాయి. ఆ సమయంలో గుర్తు తెలియని ఆగంతకుడు మైనర్‌ బాలికపై అత్యాచారం చేశాడు. అనంతరం అమెను గొంతు నులిమి చంపటానికి ప్రయత్నించాడు. మైనర్‌ బాలిక స్పృహ కోల్పోవటంతో... చనిపోయిందని భావించిన నిందితుడు సంఘటన స్థలం నుంచి పారిపోయాడు. కాగా అపస్మారక స్థితిలో ఉన్న ఆ బాలికను గమనించిన గ్రామస్థులు, ఆమె తల్లితండ్రులకు సమాచారమిచ్చారు. బాధితురాలిని మొదట పటాన్‌లోని ప్రాథమిక వైద్య కేంద్రానికి, అనంతరం జిల్లా ఆస్పత్రికి తరలించారు. తీవ్ర రక్తస్రావానికి గురైన బాలికను కాన్పూర్‌లోని హాలెట్‌ ఆస్పత్రికి తరలించాల్సిందిగా జిల్లా ఆస్పత్రి వైద్యులు సూచించారు. హాలెట్‌ ఆస్పత్రిలో వైద్య సహాయం కొనసాగుతూ ఉండగానే మైనర్‌ బాలిక మృతి చెందింది. 

ఈ సంఘటనపై బాధితురాలి కుటుంబ సభ్యులు గుర్తు తెలియని వ్యక్తిపై ఫిర్యాదు చేశారు. ఉన్నావ్‌ ఎస్పీ, ఇతర సీనియర్‌ పోలీసు అధికారులు  పోలీసు జాగిలాలు, ఫోరెన్సిక్‌ నిపుణులతో సహా సంఘటనా స్థలానికి, మృతురాలు ఉన్న ఆస్పత్రికి వచ్చి పరిస్థితిని సమీక్షించారు. ప్రాథమిక ఆధారాల ప్రకారం ఎవరో తెలిసిన వ్యక్తే ఈ ఘోరానికి పాల్పడినట్టు భావిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ కేసును త్వరలోనే ఛేదిస్తామని వారు వెల్లడించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని