మాస్కులిస్తామని మస్కా కొట్టాడు
కరోనా(కోవిడ్-19) వైరస్పై ప్రజలకు ఉన్న భయాన్ని, మాస్క్లకు ఉన్న డిమాండ్ను సైబర్ నేరస్థులు సొమ్ము చేసుకుంటున్నారు. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థల ద్వారా మాస్క్లు కొనుగోలు చేస్తున్న వారి ఫోన్ నంబర్లు తీసుకుని అవసరమైన వాటికన్నా
వైద్యుడి నుంచి రూ.4.13లక్షలు స్వాహా
ఈనాడు, హైదరాబాద్
కరోనా(కోవిడ్-19) వైరస్పై ప్రజలకు ఉన్న భయాన్ని, మాస్క్లకు ఉన్న డిమాండ్ను సైబర్ నేరస్థులు సొమ్ము చేసుకుంటున్నారు. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థల ద్వారా మాస్క్లు కొనుగోలు చేస్తున్న వారి ఫోన్ నంబర్లు తీసుకుని అవసరమైన వాటికన్నా ఎక్కువగా అందిస్తామని, వాటిని విక్రయించి సొమ్ము చేసుకోవచ్చని..ముందుగా 30శాతం బయానా చెల్లిస్తే చాలంటున్నారు. వీరి మాటలను నమ్మి నగరానికి చెందిన ఓ వైద్యుడు రూ.4.13లక్షలు పోగొట్టుకున్నాడు. మోసపోయానని గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు.
మూడు మాస్క్లకు ఆర్డరిస్తే.. యాకుత్పురాలో క్లినిక్ నిర్వహించే ఓ వైద్యుడు సాధారణ మాస్కులు మార్కెట్లో లభించకపోవడంతో తాను వ్యక్తిగతంగా వినియోగించేందుకు మూడు సర్జికల్ మాస్కుల కోసం అన్వేషించారు. ఒక ఈ-కామర్స్ సంస్థ వెబ్సైట్లో గత నెల 18న ఆర్డర్ చేశాడు. వైద్యుడి వివరాలు తెలుసుకున్న సైబర్ నేరస్థుడు అదే నెల 20న పీటర్ పేరుతో ఫోన్ చేశాడు. మీకు కావాల్సిన మాస్క్లను పంపుతామని.. మీ వద్దకు వచ్చే రోగులు, వారి సహాయకులకు వాటిని విక్రయిస్తే లాభాలొస్తాయంటూ చెప్పాడు. ప్రస్తుతం తమ వద్ద 50 కార్టన్ల మాస్కులున్నాయని, ఒక్కో కార్టన్ రూ.30వేల చొప్పున ఇస్తామని తెలిపాడు. ఒక్కో కార్టన్లో 3వేల మాస్కులుంటాయని రూ.60వేలకు విక్రయించుకోవచ్చని ఆశ చూపించాడు. నిందితుడు చెప్పిన మాస్క్ ప్రత్యేకతలు, కంపెనీ వివరాలను వైద్యుడు అంతర్జాలంలో చూశాడు. అంతా సరిగానే ఉందని తెలుసుకున్నాక పీటర్కు ఫోన్ చేసి తనకు 50 కార్టన్ల మాస్కులు కావాలని చెప్పాడు. బయానాగా రూ.4.13లక్షలను గత నెల 24న నిందితుడి ఖాతాకు బదిలీ చేశాడు. వారమైనా సరకు రాకపోవడంతో పీటర్కు ఫోన్చేయగా.. మరో వారం పడుతుందని చెప్పాడు. అన్నట్లే వేచిచూసినా రాకపోవడంతో వైద్యుడికి అనుమానం వచ్చి ఫోన్ చేయగా.. స్విచ్ఛాఫ్ అని వచ్చింది. దీంతో పోలీసులను ఆశ్రయించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్పై రాయిదాడి కేసు.. సతీష్ కస్టడీకి కోర్టు అనుమతి
సీఎం జగన్పై గులకరాయి కేసులో అరెస్టయి రిమాండ్లో ఉన్న నిందితుడు సతీష్ కుమార్ను కస్టడీకి అనుమతిస్తూ విజయవాడ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ప్రమాదవశాత్తు పేలిన ఏకే 47.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
ప్రమాదవశాత్తు తుపాకీ పేలడంతో సీఆర్పీఎఫ్కు చెందిన అసిస్టెంట్ కమాండెంట్ శేషగిరిరావు మృతిచెందారు. -
శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో ముగ్గురి అరెస్ట్
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో అనిశా మరో ముగ్గురిని అరెస్టు చేసింది. ఆయన ఆస్తులకు బినామీలుగా ఉన్న వ్యాపారులు గోదావర్తి సత్యనారాయణమూర్తి(62), పెంట భరత్కుమార్(30), ప్రైవేటు ఉద్యోగి పెంట భరణికుమార్(30)ను వ్యవహరిస్తున్నట్లు గుర్తించింది. -
నూడుల్స్ ప్యాకెట్లలో వజ్రాలు
నూడుల్స్ ప్యాకెట్లలో దాచిపెట్టిన వజ్రాలు, ప్రయాణికుల శరీర భాగాల్లో, బ్యాగేజీలో ఉంచి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని ముంబయి విమానాశ్రయంలో కస్టమ్స్ విభాగం స్వాధీనం చేసుకుంది. -
వైకాపా నాయకుడి ఇంట్లో 384 మద్యం సీసాలు
శ్రీకాకుళంలోని కత్తెరవీధికి చెందిన వైకాపా నాయకుడు పైడి మహేశ్వరరావు నివాసంలో దాచి ఉంచిన 384 మద్యం సీసాలను టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. -
ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురికి గాయాలు
ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయిన బస్సు అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన ఘటన సూర్యాపేట జిల్లా మునగాలలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. -
అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్యాయత్నం
అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆ దంపతులు వాటిని తీర్చే దారిలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా భర్త మృతి చెందారు. ఈ విషాదకర ఘటన పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం పారుపల్లిలో జరిగింది. -
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
హైదరాబాద్ నగరంలోని యూసఫ్గూడలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక యువతిపై బస్సు ఎక్కడంతో తీవ్రగాయాలతో ఆమె మృతిచెందింది.
తాజా వార్తలు (Latest News)
-
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం
-
టేకాఫ్ సమయంలో ఊడిన బోయింగ్ విమానం టైరు
-
సొంత అభ్యర్థికి వ్యతిరేకంగా ‘కాంగ్రెస్’ ప్రచారం.. ఎందుకంటే!
-
రెజ్యూమె రూపొందించడంలో ఈ తప్పులొద్దు.. గూగుల్ మాజీ రిక్రూటర్ టిప్స్
-
కోటక్ బ్యాంక్కు ఆర్బీఐ షాక్.. క్రెడిట్ కార్డుల జారీ, కొత్త కస్టమర్ల చేరికపై ఆంక్షలు
-
‘మా పేరుతో తప్పుడు ప్రచారం’.. ప్రజలకు ఎల్ఐసీ అలర్ట్!