రాజేంద్రనగర్‌లో పేలుడు

రాజేంద్రనగర్‌లోని శివరాంపల్లి రైల్వేస్టేషన్‌ వద్ద పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి సమీపంలోని పలు ఇళ్ల కిటికీల అద్దాలు పగిలిపోయాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అధికారులు ఘటనాస్థలికి చేరుకొని పరిశీలిస్తున్నారు. పేలుడుకు గల

Updated : 14 Mar 2020 14:02 IST

రాజేంద్రనగర్‌, హైదరాబాద్‌: రాజేంద్రనగర్‌లోని స్థానిక కాటేదాన్‌ వడ్డెర బస్తీలో చెత్తకుప్పలో పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి పరిసర ప్రాంతాల్లోని ఇళ్ల కిటికీ అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ పేలుడుతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఆ ప్రాంతంలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పిందని స్థానికులు తెలిపారు. సమాచారమందుకున్న మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించారు. పేలుడుకు గల కారణాలు తెలియరాలేదు. ఏదైనా రసాయన పదార్థం వల్ల పేలుడు సంభవించిందా? లేదా జిలెటిన్‌ స్టిక్స్‌ వల్ల పేలుడు జరిగిందా? నిర్ధారించాల్సి ఉందని పోలీసులు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని