ఎల్బీనగర్‌లో భారీగా గంజాయి పట్టివేత

రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్‌ శివారులో డీఆర్‌ఐ అధికారులు భారీ మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ట్రక్కులో అక్రమంగా తరలిస్తున్న 1,554 కిలోల గంజాయిని అధికారులు...

Published : 16 Mar 2020 00:55 IST

ఎల్బీనగర్‌: రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్‌ శివారులో డీఆర్‌ఐ అధికారులు భారీ మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ట్రక్కులో అక్రమంగా తరలిస్తున్న 1,554 కిలోల గంజాయిని అధికారులు పట్టుకున్నారు. దీని విలువ దాదాపు రూ. 3.10 కోట్లు ఉంటుందని అధికారుల అంచనా. ఖమ్మం జిల్లా భద్రాచలం నుంచి హైదరాబాద్‌ మీదుగా కర్ణాటకలోని బీదర్‌కు అక్రమంగా తరలిస్తున్నట్లు డీఆర్‌ఐ అధికారులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి మొత్తం ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్లు డీఆర్‌ఐ అధికారులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని