ఆ విషయం దాస్తారా.. స్టేషన్కు పదండి!
మహారాష్ట్రలో విదేశీ పర్యటనకు వెళ్లొచ్చిన ఇద్దరు దంపతులు వివాదంలో చిక్కుకున్నారు. విదేశీ పర్యటనకు వెళ్లి వచ్చిన విషయాన్ని దాచినందుకు పోలీసులు వారిపై కేసు నమోదు చేయడంతో షాక్కు గురయ్యారు.
ముంబయి: మహారాష్ట్రలో విదేశీ పర్యటనకు వెళ్లొచ్చిన ఇద్దరు దంపతులు వివాదంలో చిక్కుకున్నారు. విదేశీ పర్యటనకు వెళ్లి వచ్చిన విషయాన్ని దాచినందుకు పోలీసులు వారిపై కేసు నమోదు చేయడంతో షాక్కు గురయ్యారు. ఈ ఘటన మహారాష్ట్రలోని ఔరంగాబాద్ అమల్నర్లో జరిగింది. కరోనా వైరస్ నేపథ్యంలో ఎవరైనా విదేశాలకు వెళ్లి వస్తే.. అధికారులను సంప్రదించి సంబంధిత జాగ్రత్తలు పాటించమని ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. లక్షణాలు ఉన్నా లేకపోయినా క్వారంటైన్లో ఉండమని సూచించింది. కానీ ఆ దంపతులు థాయ్లాండ్కు వెళ్లి వచ్చిన విషయాన్ని దాచి పుణెలో తమ కుమారుడి వద్దకు వెళ్లి వచ్చినట్లు చెప్పారు. కానీ పోలీసులు తాజాగా డేటా ట్రాకింగ్ చేయగా వారు విదేశీ పర్యటన నుంచి వచ్చినట్లు తేలడంతో వారిపై కేసు నమోదు చేశారు.
అమల్నర్ పోలీస్ స్టేషన్లో ఓ అధికారి మాట్లాడుతూ.. ‘గజానన్ నగర్లో ఉండే దంపతుల్ని విదేశాలకు వెళ్లి వచ్చారా లేదా అని ఇటీవల ఆరా తీయగా వారు లేదని చెప్పారు. పుణెలో తమ కుమారుడి వద్దకు వెళ్లినట్లు చెప్పారు. ట్రాకింగ్ విచారణలో వారు థాయ్లాండ్కు వెళ్లినట్లు తేలింది. దీంతో వారిపై (ఎపిడమిక్ డిసీజ్ కంట్రోల్ చట్టం 1897) కింద కేసు నమోదు చేశాం’ అని తెలిపారు. ప్రస్తుతం వారిని క్వారంటైన్లో ఉంచామని.. వారి నమూనాల్ని పరీక్షలకు పంపినట్లు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దర్యాప్తు బృందం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు నమోదు చేసింది. -
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో నాలుగు రోజుల క్రితం మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అనుచరుడి వద్ద భారీగా మద్యం స్వాధీనం చేసుకున్న ఘటన మరువక ముందే తాజాగా పొదలకూరు మండలం విరువూరులో మరో అనుచరుడు చిర్రా రాజగోపాల్రెడ్డి రైస్మిల్లులో మద్యం నిల్వలను బుధవారం సెబ్, పోలీసు అధికారులు సీజ్ చేశారు. -
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. -
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
సూర్యాపేట జిల్లా కోదాడలో జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సు బోల్తా
లక్షలాది కి.మీ. తిరిగిన బస్సులను స్క్రాబ్కు పంపకుండా రోడ్లపైకి పంపడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్లే. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం.. ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. -
పల్నాడులో తెదేపా కార్యకర్తలపై.. వైకాపా వర్గీయుల దాడి
`పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లలో వైకాపా వర్గీయుల దాడిలో తెదేపాకు చెందిన నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. -
గుంతలో పడి.. ఏకే 47 పేలి.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని 81 బెటాలియన్ బేస్ క్యాంపు పరిధిలో బుధవారం ఏకే-47 తుపాకి ప్రమాదవశాత్తు పేలడంతో విధుల్లో ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ ఎంవీ శేషగిరి(47) మృతి చెందారు. -
ఇంటర్లో ఫెయిలైన ఏడుగురు విద్యార్థుల బలవన్మరణం
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామని మనస్తాపంతో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ