వ్యక్తిపై దాడి చేసిన కానిస్టేబుల్‌ సస్పెండ్‌

లాక్‌డౌన్‌ సందర్భంగా ఇటీవల గుంటూరు జిల్లా గురజాలలో వ్యక్తిపై దాడిచేసిన ఘటనలో కానిస్టేబుల్‌పై సస్పెన్షన్‌ వేట పడింది. ఈ మేరకు క్రమశిక్షణ చర్యలు తీసుకుంటూ గ్రామీణ ఎస్పీ విజయరావు

Published : 05 Apr 2020 01:22 IST

గుంటూరు: లాక్‌డౌన్‌ సందర్భంగా ఇటీవల గుంటూరు జిల్లా గురజాలలో వ్యక్తిపై దాడిచేసిన ఘటనలో కానిస్టేబుల్‌పై సస్పెన్షన్‌ వేట పడింది. ఈ మేరకు క్రమశిక్షణ చర్యలు తీసుకుంటూ గ్రామీణ ఎస్పీ విజయరావు ఆదేశాలు జారీ చేశారు. మార్చి 23న గురజాల ఆర్డీవో కార్యాలయం వద్ద వ్యక్తిపై కానిస్టేబుల్‌ కృష్ణమూర్తి దురుసుగా ప్రవర్తించి దాడి చేశాడు. ఆ సమయంలో దాడి ఘటనపై అధికారులకు సమాచారం ఇవ్వనందుకు గురజాల సీఐకి ఛార్జ్‌మెమో జారీ చేశారు. ఘటనా స్థలిలో కానిస్టేబుల్‌ను నిలువరించనందుకు ఏఎస్‌ఐ స్టాలిన్‌కు ఛార్జి మెమో ఇచ్చారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని