OLXలో ఐక్యతా విగ్రహం అమ్మకానికి అంటూ..
ప్రపంచంలోనే అతిపెద్దదైన భారతదేశానికి చెందిన ఐక్యతా విగ్రహాన్ని (స్టాట్యూ ఆఫ్ యూనిటీ) కొందరు ప్రబుద్దులు అమ్మకానికి పెట్టారు.
కరోనా నివారణకు నిధులు కావాలంటూ ఆకతాయిల ప్రకటన
వడోదర: కరోనా కట్టడి కోసం ఓ వైపు అధికార యంత్రాంగం నిరంతం శ్రమిస్తుంటే.. మరోవైపు ఆకతాయిల చేష్టలు వారిని ఇబ్బందికి గురిచేస్తున్నాయి. కరోనాపై పోరాటానికి నిధుల కోసమంటూ పలువురు ఏకంగా ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఐక్యతా విగ్రహాన్ని (స్టాట్యూ ఆఫ్ యూనిటీ) ఓఎల్ఎక్స్లో అమ్మకానికి పెడుతున్నట్లు ప్రకటన ఉంచారు. ఆస్పత్రుల ఏర్పాటు, వైద్య పరికరాల కొనుగోళ్ల కోసం దీన్ని రూ.30,000 కోట్లకు విక్రయిస్తున్నామంటూ ఆకతాయిలు ఆ ప్రకటనలో తెలిపారు. అయితే ఈ విషయాన్ని గుర్తించిన ఐక్యతా విగ్రహం నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మోసానికి పాల్పడటం, అంటువ్యాధుల నివారణ చట్టం, ఐటీ చట్టాల కింద నిందితులపై కేసు నమోదు చేశామని పోలీసు ఉన్నతాధికారులు వివరించారు. కాగా ఈ ప్రకటనను ఓఎల్ఎక్స్ సంస్థ తమ వెబ్సైట్ నుంచి తొలగించింది. దీనిపై ట్విటర్ ద్వారా క్షమాపణలు కోరింది. ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ స్మృతి చిహ్నంగా గుజరాత్లోని నర్మదా నది తీరంలో ఈ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎంపై రాయి విసిరిన కేసులో నిందితుడు సతీష్ అరెస్టు
విజయవాడలో రోడ్షో నిర్వహిస్తుండగా సీఎం జగన్పై రాయితో దాడిచేసిన కేసులో ఒక నిందితుడిని పోలీసులు అరెస్టు చూపించారు. -
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
ఏటీఎంలలో నగదు నింపే సీఎంఎస్ వాహనం నుంచి రూ.64 లక్షలు చోరీ చేసిన ఓ వ్యక్తి వాటిని మర్రి చెట్టు తొర్రలో దాచిపెట్టిన ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో చోటుచేసుకుంది. -
డిప్యూటీ మేయర్ కారు షెడ్లో మద్యం
ఎన్నికల నామినేషన్ మొదటి రోజే వైకాపా నేతకు చెందిన స్థలంలో అక్రమంగా ఉంచిన 170 కేసుల మద్యం పట్టుబడింది. -
వేటగాళ్ల ఉచ్చుకు ఏనుగు బలి
వన్యప్రాణుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్ ఉచ్చు తగిలి ఓ ఏనుగు మృతి చెందింది. చిత్తూరు జిల్లా గంగవరం మండలం బూడిదపల్లె శివారులో గురువారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. -
అనిశాకు చిక్కిన అయిదుగురు ఉద్యోగులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం రెండు వేర్వేరు ఘటనల్లో అయిదుగురు అధికారులు లంచం తీసుకుంటూ అనిశాకు పట్టుబడ్డారు. -
బాలుడి మృతదేహాన్ని పాతిపెట్టి.. బతికున్నట్లు తల్లిని నమ్మించి..!
నాటు వైద్యం వికటించి ఓ బాలుడు మూడున్నరేళ్ల క్రితమే మృతిచెందగా.. విషయం బయటకు పొక్కనీయకుండా, అతను బతికే ఉన్నట్లు ఆ బాలుడి తల్లిని నమ్మిస్తూ ఆమె భర్త, నాటు వైద్యుడు కలిసి వేధించిన ఉదంతమిది. -
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ కుమార్తెపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె ప్రాణాలు కోల్పోయింది.