లాక్డౌన్లో ప్రార్థనలు.. 40మందిపై కేసు
కరోనా వైరస్ పోరులో భాగంగా అమలవుతోన్న దేశవ్యాప్త లాక్డౌన్ సందర్భంగా ప్రార్థనా మందిరాలతో పాటు వ్యవస్థలన్నీ స్తంభించిపోయాయి. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వచ్చేవారు మాత్రం గుంపులుగా కాకుండా సామాజిక దూరాన్ని పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.
చింద్వారా: కరోనా వైరస్ పోరులో భాగంగా అమలవుతున్న దేశవ్యాప్త లాక్డౌన్ సందర్భంగా ప్రార్థనా మందిరాలతో పాటు వ్యవస్థలన్నీ స్తంభించిపోయాయి. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వచ్చేవారు మాత్రం గుంపులుగా కాకుండా సామాజిక దూరాన్ని పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ సమయంలో నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. తాజాగా మధ్యప్రదేశ్లో లాక్డౌన్ నిబంధనలు బేఖాతరు చేస్తూ ప్రార్థనలకు హాజరైన 40మందిపై కేసులు నమోదు చేశారు పోలీసులు. మధ్యప్రదేశ్ చింద్వారా జిల్లాలోని చౌరాయిలో ఉన్న స్థానిక మసీదుకు హాజరై ప్రార్థనలు నిర్వహించారు అక్కడి ముస్లింలు. ఆ సమయంలో వారు సామాజికదూరం పాటించకపోవడంతో పాటు మాస్కులు కూడా ధరించలేదని అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో సెక్షన్ 144 అమల్లో ఉంది. దీంతో నిబంధనలను ఉల్లంఘించిన 40మందిపై కేసులు నమోదు చేశామని స్థానిక పోలీసులు వెల్లడించారు. వీరిపై అంటువ్యాధుల చట్టం -1897తో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
మరోవైపు మధ్యప్రదేశ్లో ఇప్పటికే కొవిడ్-19 వైరస్ తీవ్రత అధికంగా ఉంది. మర్కజ్ ఘటన తర్వాత రాష్ట్రంలో కరోనా కేసులు అధిక సంఖ్యలో నమోదవుతున్నాయి. రాష్ట్రంలో 397 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 24 మంది మరణించారని ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి వెల్లడించారు. కేవలం ఇండోర్లోనే 221 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. భోపాల్లో 98 కరోనా కేసులు నమోదయ్యాయి. లాక్డౌన్ పటిష్ఠంగా అమలుచేసేందుకు పలుచోట్ల 144 సెక్షన్ విధించారు. రాష్ట్రంలో కరోనా తీవ్రత అధికంగా ఉన్న 15జిల్లాల్లో హాట్స్పాట్లను గుర్తించి సీల్ చేయాలని ముఖ్యమంత్రి శివ్రాజ్సింగ్ చౌహాన్ ఆదేశించారు.
క్వారంటైన్లో ఉన్నవారి ఇళ్లకు తాళం..
మధ్యప్రదేశ్లో కరోనా వైరస్ తీవ్రత పెరగడంతో పలుచోట్ల అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా ఛాతర్పూర్ జిల్లాలోని ఖజురహో, రాజ్నగర్లో క్వారంటైన్లో ఉన్నవారి ఇళ్లకు తాళం వేశారు. కరోనా తీవ్రత అధికంగా ఉండి డేంజర్జోన్గా ప్రకటించిన ప్రాంతాల నుంచి వారి ఇళ్లకు చేరుకోవడంతో వీరిని క్వారంటైన్లో ఉండాలని అధికారులు సూచించారు. కానీ, గత రెండు రోజులుగా నిబంధనలు అతిక్రమిస్తూ అధికారులకు సహకరించకపోవడంతో వీరి ఇంటికి తాళం వేయాలని జిల్లా కలెక్టర్ నిర్ణయించారు. అయితే వీరికి కావల్సిన నిత్యవసర వస్తువులను అందించేందుకు అన్నిఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఘోరం: పెదవులను అతికించి.. నెల రోజులు లైంగికంగా హింసించి..!
Crime News: తమ పొరుగునే ఉంటున్న వ్యక్తి చేతిలో ఓ యువతి లైంగిక దోపిడీకి గురైంది. శారీరకంగా హింస అనుభవించింది. -
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు నీటిలోపడి మృతిచెందారు. -
పుత్తూరులో భారీ మద్యం డంప్ స్వాధీనం
తిరుపతి జిల్లా పుత్తూరులో భారీ మద్యం డంప్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం కేసులను వైకాపా నాయకులు ప్రైవేటు కళాశాలలో డంప్ చేసినట్లు గుర్తించారు. -
సీఎంపై రాయి విసిరిన కేసులో నిందితుడు సతీష్ అరెస్టు
విజయవాడలో రోడ్షో నిర్వహిస్తుండగా సీఎం జగన్పై రాయితో దాడిచేసిన కేసులో ఒక నిందితుడిని పోలీసులు అరెస్టు చూపించారు. -
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
ఏటీఎంలలో నగదు నింపే సీఎంఎస్ వాహనం నుంచి రూ.64 లక్షలు చోరీ చేసిన ఓ వ్యక్తి వాటిని మర్రి చెట్టు తొర్రలో దాచిపెట్టిన ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో చోటుచేసుకుంది. -
డిప్యూటీ మేయర్ కారు షెడ్లో మద్యం
ఎన్నికల నామినేషన్ మొదటి రోజే వైకాపా నేతకు చెందిన స్థలంలో అక్రమంగా ఉంచిన 170 కేసుల మద్యం పట్టుబడింది. -
వేటగాళ్ల ఉచ్చుకు ఏనుగు బలి
వన్యప్రాణుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్ ఉచ్చు తగిలి ఓ ఏనుగు మృతి చెందింది. చిత్తూరు జిల్లా గంగవరం మండలం బూడిదపల్లె శివారులో గురువారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. -
అనిశాకు చిక్కిన అయిదుగురు ఉద్యోగులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం రెండు వేర్వేరు ఘటనల్లో అయిదుగురు అధికారులు లంచం తీసుకుంటూ అనిశాకు పట్టుబడ్డారు. -
బాలుడి మృతదేహాన్ని పాతిపెట్టి.. బతికున్నట్లు తల్లిని నమ్మించి..!
నాటు వైద్యం వికటించి ఓ బాలుడు మూడున్నరేళ్ల క్రితమే మృతిచెందగా.. విషయం బయటకు పొక్కనీయకుండా, అతను బతికే ఉన్నట్లు ఆ బాలుడి తల్లిని నమ్మిస్తూ ఆమె భర్త, నాటు వైద్యుడు కలిసి వేధించిన ఉదంతమిది. -
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ కుమార్తెపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె ప్రాణాలు కోల్పోయింది.
తాజా వార్తలు (Latest News)
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
-
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ
-
‘పొరుగు వారితో ఘర్షణ వద్దు’: వేదాలు వల్లించిన నవాజ్ షరీఫ్ కుమార్తె
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!