ఐదుగురు పిల్లలను గంగానదిలో తోసిన తల్లి

భార్యాభర్తల మధ్య గొడవ మూలంగా ఒక తల్లి తన ఐదుగురు పిల్లలను గంగానదిలోకి తోసివేసిన దారుణ ఘటన యూపీలో శనివారం రాత్రి చోటుచేసుకుంది.

Updated : 13 Apr 2020 13:39 IST

భార్యాభర్తల మధ్య గొడవే కారణం

లఖ్‌నవూ: భార్యాభర్తల మధ్య గొడవ మూలంగా ఒక తల్లి తన ఐదుగురు పిల్లలను గంగానదిలోకి తోసివేసిన దారుణ ఘటన యూపీలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. దీంతో వారంతా నదిలో గల్లంతయ్యారు. భదోహి జిల్లా ఎస్పీ రామ్‌బదన్‌సింగ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని భదోహి ప్రాంతానికి చెందిన మృదుల్‌యాదవ్‌, మంజుయాదవ్‌ భార్యాభర్తలు. వీరికి ఐదుగురు పిల్లలున్నారు. అయితే ఏడాదిగా దంపతులిద్దరి మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నాయి. శనివారం రాత్రి సైతం వారి మధ్య గొడవ జరిగింది. దీంతో మంజుయాదవ్ తన ఐదుగురు పిల్లలను తీసుకుని జహంగీరాబాద్‌లోని గంగానదిఘాట్ వద్దకు చేరుకుంది. ఒక్కసారిగా తన ఐదుగురి పిల్లల్ని నదిలోకి తోసివేయగా వారు ఆ ప్రవాహంలో కొట్టుకుపోయారు. పిల్లల్ని తోసివేస్తున్న క్రమంలో వారు గట్టిగా కేకలు పెట్టడంతో సమీపంలో ఉన్న స్థానికులు వారిని కాపాడాల్సింది పోయి.. ఆమె ఒక మంత్రెగత్తెగా భావించి అక్కడి నుంచి పారిపోయారు. అనంతరం మంజుయాదవ్‌ నది ఒడ్డు వద్దనే ఉండి ఆదివారం ఉదయం గ్రామస్థులకు తెలిపింది. దీంతో సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే పిల్లులు కొట్టుకుపోయిన ప్రాంతానికి చేరుకొని గాలింపు చేపట్టారు. జహంగీరాబాద్‌ ఘాట్‌ వద్ద భారీ ప్రవాహం, లోతు ఎక్కువగా ఉంటుందని పోలీసులు తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని