వైద్యులు, పోలీసులపై రాళ్లదాడి
కరోనా అనుమానితుల్ని తీసుకెళ్లేందుకు వచ్చిన వైద్య సిబ్బందిపై స్థానికులు రాళ్లదాడికి దిగారు. వారి వాహనాలను ధ్వంసం చేశారు. ఈ ఘటన ఉత్తర్ప్రదేశ్లో....
లఖ్నవూ: కరోనా అనుమానితుల్ని తీసుకెళ్లేందుకు వచ్చిన వైద్య సిబ్బందిపై స్థానికులు రాళ్లదాడికి దిగారు. వారి వాహనాలను ధ్వంసం చేశారు. ఈ ఘటన ఉత్తర్ప్రదేశ్లో చోటుచేసుకుంది. దీనిపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.
మొరాదాబాద్లోని నవాబ్పురా కాలనీలో ఇద్దరు కరోనా అనుమానితుల్ని తీసుకెళ్లేందుకు వైద్య సిబ్బంది అంబులెన్సులో అక్కడికి చేరుకున్నారు. వారి రాకను గమనించిన స్థానికులు రాళ్లు, ఇటుకులతో దాడికి దిగారు. వైద్య సిబ్బందికి రక్షణగా వచ్చిన పోలీసు వాహనాలపైనా వారు దాడి చేశారు. ఈ ఘటనలో పలువురు వైద్య, పోలీసుల సిబ్బందికి గాయాలయ్యాయి.
ఈ ఘటనతో సంబంధం ఉన్న 10 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలువురి కోసం గాలిస్తున్నారు. ఘటనపై స్పందించిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దాడికి పాల్పడిన వారిపై జాతీయ భద్రత చట్టం కింద కేసులు పెట్టాలని పోలీసులను ఆదేశించారు. జరిగిన ఆస్తి నష్టాన్ని కూడా వారి నుంచే వసూలు చేయాలన్నారు. ఘటన అనంతరం స్థానికంగా భద్రతను కట్టుదిట్టం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్