లాక్డౌన్లోనూ ఆగని అక్రమ రవాణా
కరోనా వైరస్ నియంత్రణ కోసం కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ కారణంగా పలు రకాల వ్యాపార కార్యకలాపాలు ఆగిపోయిన సంగతి తెలిసిందే. అయితే మత్తు పదార్థాలు, నకిలీ నోట్ల అక్రమ రవాణా మాత్రం భారత్-పాకిస్థాన్, భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతాల......
దిల్లీ: కరోనా వైరస్ నియంత్రణ కోసం కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ కారణంగా పలు రకాల వ్యాపార కార్యకలాపాలు ఆగిపోయిన సంగతి తెలిసిందే. అయితే మత్తు పదార్థాలు, నకిలీ నోట్ల అక్రమ రవాణా మాత్రం భారత్-పాకిస్థాన్, భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతాల వెంబడి యథేచ్చగా సాగినట్లు నివేదికలు వెల్లడించాయి.
పాక్, బంగ్లా దేశాలతో భారత్ సరిహద్దు భద్రతను బీఎస్ఎఫ్ (సరిహద్దు భద్రతా దళం) పర్యవేక్షిస్తుంటుంది. జనవరి 1 నుంచి ఏప్రిల్ 12 మధ్య కాలంలో ఈ రెండు దేశాల సరిహద్దు ప్రాంతాల్లో అక్రమ రవాణా ఘటనలు ఎక్కువ కావడంతో బీఎస్ఎఫ్ భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది. దీంతో ఇటువంటి ఘటనలు కొంత మేర తగ్గుముఖం పట్టినట్లు బీఎస్ఎఫ్ తెలిపింది.
తరచుగా హెరాయిన్ వంటి మత్తు పదార్థాలు పాకిస్థాన్ నుంచి పంజాబ్ సరిహద్దులు గుండా భారత్లోకి అక్రమంగా తీసుకొస్తుంటారు. అయితే దేశం మొత్తం లాక్డౌన్ విధించినప్పటికీ వీటి అక్రమ రవాణా కొనసాగినట్లు సమాచారం. తరచుగా తీసుకెళ్లే (97 కిలోలు) దానికంటే తక్కువ మొత్తంలో (18 కిలోలు) హెరాయిన్ను అక్రమ రవాణా చేసినట్లు సమాచారం. బంగ్లాదేశ్ సరిహద్దుల్లో 328 పశువుల అక్రమ రవాణాను బీఎస్ఎఫ్ అడ్డుకోగా, సాధారణ రోజుల్లో వీటి సంఖ్య 20వేల వరకు ఉంటుందని నివేదికల్లో పేర్కొన్నారు.
‘‘సరిహద్దుల వెంబడి జరిగే నేరాల గురించి అప్రమత్తంగా ఉండాలని బీఎస్ఎఫ్కు ఆదేశాలు జారీచేశాం. లాక్డౌన్ కారణంగా నేరాల సంఖ్య తగ్గినప్పటికీ, భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ప్రతి రోజూ అటువంటి ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. రెండు దేశాల సరిహద్దు భద్రత విషయంలో బీఎస్ఎఫ్ మరింత అప్రమత్తంగా ఉంటుంది’’ అని దిల్లీలోని బీఎస్ఎఫ్ అధికార ప్రతినిధి తెలిపారు. సాధారణ రోజులతో పోలిస్తే లాక్డౌన్లో ఫెన్స్డేల్, యాబా ట్యాబ్లెట్స్, గంజాయి వంటి మత్తు పదార్థాల రవాణా మూడు రెట్లు తగ్గినట్లు బీఎస్ఎఫ్ తెలిపింది. అంతే కాకుండా నకిలీ భారత కరెన్సీ నోట్లు (ఎఫ్ఐసీఎన్) అక్రమ రవాణా కూడా మూడు రెట్లు తగ్గినట్లు తెలిపారు. బంగారం, వెండి ఆభరణాల అక్రమ రవాణా పూర్తిస్థాయిలో ఆగిపోయినట్లు నివేదికలు చెబుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్పై రాయిదాడి కేసు.. నిందితుడికి 14 రోజుల రిమాండ్
సీఎం జగన్పై రాయిదాడి కేసులో నిందితుడికి విజయవాడ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. -
జగన్పై రాయిదాడి కేసులో అనుమానితుడి అరెస్ట్
సీఎం జగన్పై రాయిదాడి కేసులో అనుమానితుడిని విజయవాడ అజిత్సింగ్ నగర్ పోలీసులు అరెస్టు చేశారు. -
సాఫ్ట్వేర్ ఉద్యోగి ఫిర్యాదు.. కేసీఆర్ అన్న కుమారుడిపై మరో కేసు
మాజీ సీఎం, భారాస అధినేత కేసీఆర్ అన్న కుమారుడు కన్నారావు సహా ఐదుగురిపై బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. -
గంజాయి మిల్క్షేక్!.. మత్తు ముఠాల నయా దందా
గంజాయి విక్రేతలు కొత్త పంథా అనుసరిస్తున్నారు. హ్యాష్ ఆయిల్.. చాక్లెట్లుగా మార్చి విక్రయించడం పాత ట్రెండు.. ఇప్పుడు గంజాయిని పొడిగా చేసి విక్రయిస్తున్నారు. -
సినీనటుడు రఘుబాబు కారు ఢీకొని భారాస నాయకుడి దుర్మరణం
సినీనటుడు రఘుబాబు కారు ఢీకొని నార్కట్పల్లి-అద్దంకి రహదారి నల్గొండ జిల్లా కేంద్రంలో భారాస నాయకుడు మృతిచెందారు. -
ప్రకాశం జిల్లాలో మద్యం డంప్ స్వాధీనం
ప్రకాశం జిల్లాలో అక్రమంగా నిల్వ చేసిన మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దర్శి సెబ్ కార్యాలయంలో ఎస్పీ గరుడ్ సుమిత్సునీల్ బుధవారం వివరాలను వెల్లడించారు. -
మావోయిస్టులకు శరాఘాతం!
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కాంకేర్ జిల్లాలో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యంగా ఉత్తర బస్తర్ డివిజన్ కమిటీ భారీ మూల్యం చెల్లించుకుంది. -
జువెనైల్ హోమ్ నుంచి ఎనిమిది మంది పరారీ
కిటికీ గ్రిల్స్ తొలగించి జువెనైల్ హోమ్ నుంచి ఎనిమిది మంది బాలురు పరారైన ఘటన మేడ్చల్ జిల్లా గాజులరామారంలో సంచలనం సృష్టించింది. -
తప్పుడు ప్రకటనలతో మందుల విక్రయం
జ్వరాన్ని నయం చేస్తుందని తప్పుడు ప్రకటనలతో విక్రయిస్తున్న మందులను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఔషధ నియంత్రణ మండలి (డీసీఏ) డైరెక్టర్ జనరల్ వి.బి.కమలాసన్రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
గుజరాత్లో రోడ్డు ప్రమాదం.. 10 మంది దుర్మరణం
గుజరాత్లో ఆగివున్న చమురు ట్యాంకర్ను వేగంగా వెళుతున్న కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ చిన్నారి సహా 10 మంది దుర్మరణం చెందినట్లు పోలీసులు తెలిపారు. -
అనంత్నాగ్లో బిహార్ కూలీని కాల్చిచంపిన ఉగ్రవాదులు
జమ్మూ-కశ్మీర్లో ఉగ్రవాదులు మరోమారు పేట్రేగిపోయారు. బుధవారం అనంత్నాగ్ జిల్లాలో బిహార్కు చెందిన కూలీని కాల్చి చంపారు.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా అభ్యర్థి అంబటి మురళీపై చర్యలకు ఈసీ ఆదేశం
-
విధుల్లో అలసత్వం.. ఆరుగురు పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు
-
కిమ్ ‘జీవాయుధ’ కార్యక్రమం.. వ్యాధుల వ్యాప్తికి ‘విషపు పెన్నులు’, స్ప్రేలు!
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
‘కేజ్రీవాల్ హత్యకు కుట్ర’.. ఆప్ తీవ్ర ఆరోపణలు
-
దక్షిణాదిలో ఈసారి భాజపా అత్యుత్తమ పనితీరు: అమిత్ షా