పెళ్లి ఆగిందని ఆత్మహత్య

పెళ్లి ఆగిందనే మనస్తాపంతో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. అనంతపురంజిల్లా ధర్మవరం శాంతినగర్‌లో ఈ ఘటన జరిగింది. చేనేత

Updated : 19 Apr 2020 10:09 IST

ధర్మవరం : పెళ్లి ఆగిందనే మనస్తాపంతో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. అనంతపురంజిల్లా ధర్మవరం శాంతినగర్‌లో ఈ ఘటన జరిగింది. చేనేత కార్మికురాలైన పబ్బతి హేమావతి(25)కి ఈనెల 25, 26న వివాహం జరగాల్సి ఉంది. ఆమె తండ్రి ఇదివరకే మృతి చెందగా కుటుంబ బాధ్యత తల్లి నారాయణమ్మపై పడింది. ఈమె ఆరో కుమార్తె. ఇద్దరూ కూలి మగ్గం నేస్తూ జీవిస్తున్నారు. పెళ్లి కోసం అప్పు అడిగారు. లాక్‌డౌన్‌ కారణంతో వ్యాపారాలు బంద్‌ కావడం, మగ్గాలు మూతపడటంతో డబ్బు చేతికి అందలేదు. దీంతో పెళ్లి ఆగిందనే మనస్తాపంతో శనివారం మగ్గాల షెడ్డులో చీరతో ఉరి వేసుకుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని