దేవరకొండ ప్రభుత్వాసుపత్రిలో గర్భిణి మృతి

నల్గొండ జిల్లా దేవరకొండ ప్రభుత్వాసుపత్రిలో గర్భిణి మృతి చెందిన ఘటన సోమవారం జరిగింది. మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం..

Published : 20 Apr 2020 10:29 IST

దేవరకొండ : నల్గొండ జిల్లా దేవరకొండ ప్రభుత్వాసుపత్రిలో గర్భిణి మృతి చెందిన ఘటన సోమవారం జరిగింది. మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం..  దిండి మండలం ఎర్రారం గ్రామానికి చెందిన సమత (23) అనే మహిళకు పురిటి నొప్పులు రావడంతో ఈ రోజు తెల్లవారుజామున దేవరకొండ ప్రభుత్వాసుపత్రికి అంబులెన్సులో తరలించారు. ఈ సమయంలో సంబంధిత వైద్యులు అందుబాటులో లేరు. దీంతో విధుల్లో ఉన్న నర్సు ఆసుపత్రికి వచ్చిన గర్భిణీకి మాత్రలు వేశారు. అనంతరం  బాత్రూమ్‌కు వెళ్లిన సమత అక్కడే కుప్పకూలిపోయింది. వైద్య సిబ్బంది వచ్చి చూడగా అప్పటికే ఆమె మృతి చెందింది. వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతోనే సమత మృతి చెందిందని మృతురాలి బంధువులు ఆరోపిస్తూ ఆస్పత్రిలోని సామగ్రిని ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని