హత్యా..ఆత్మహత్యా?

అనుమానాస్పద స్థితిలో ఒక కార్మికుడు మృతిచెందడాన్ని గురువారం మైలార్‌దేవుపల్లి ఠాణా పోలీసులు కనుగొన్నారు. ఇన్‌స్పెక్టర్‌ సత్తయ్య కథనం ప్రకారం..ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన అతడు ఎనిమిది నెలల క్రితం నగరానికి వచ్చి కాటేదాన్‌లో స్థిరపడ్డాడు.

Published : 24 Apr 2020 06:05 IST

కాటేదాన్‌, న్యూస్‌టుడే: అనుమానాస్పద స్థితిలో ఒక కార్మికుడు మృతిచెందడాన్ని గురువారం మైలార్‌దేవుపల్లి ఠాణా పోలీసులు కనుగొన్నారు. ఇన్‌స్పెక్టర్‌ సత్తయ్య కథనం ప్రకారం..ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన అతడు ఎనిమిది నెలల క్రితం నగరానికి వచ్చి కాటేదాన్‌లో స్థిరపడ్డాడు. మూడురోజుల క్రితం బయటకు వెళ్లి తిరిగి రాలేదు. మైలార్‌దేవుపల్లి రైల్వేగేటు మార్గంలోని కాలువలో గుర్తుపట్టలేని రీతిలో మృతదేహం పడిఉందని సమాచారం అందడంతో, ఆ స్థలానికి చేరుకున్న పోలీసులు ఆరా తీశారు. ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. శవపరీక్ష నివేదిక రాగానే కేసు దర్యాప్తు వేగవంతం చేస్తామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు