ఉదయపు నడకలో గుండెపోటు

ఉదయపు నడక సమయంలో గుండెపోటుతో ఓ సాఫ్ట్‌వేర్‌ మృతిచెందిన ఘటన బాచుపల్లి ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. కోల్‌కతాకు చెందిన సోంనాథ్‌సాహ (40) నిజాంపేట పరిధిలోని సిద్ధివినాయక్‌నగర్‌లో నివాసం ఉంటున్నారు. గచ్చిబౌలిలోని ఓ సంస్థలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. రోజు మాదిరిగానే ప్రగతినగర్‌ అంబీర్‌

Published : 24 Apr 2020 06:05 IST

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ దుర్మరణం

నిజాంపేట, న్యూస్‌టుడే: ఉదయపు నడక సమయంలో గుండెపోటుతో ఓ సాఫ్ట్‌వేర్‌ మృతిచెందిన ఘటన బాచుపల్లి ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. కోల్‌కతాకు చెందిన సోంనాథ్‌సాహ (40) నిజాంపేట పరిధిలోని సిద్ధివినాయక్‌నగర్‌లో నివాసం ఉంటున్నారు. గచ్చిబౌలిలోని ఓ సంస్థలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. రోజు మాదిరిగానే ప్రగతినగర్‌ అంబీర్‌ చెరువు వద్ద గురువారం వాకింగ్‌ చేస్తుండగా ఒక్కసారిగా కిందపడిపోయాడు. దీంతో స్థానికులు 108 వాహనానికి సమాచారం అందించగా.. వారు వచ్చేసరికి చనిపోయాడు. గుండెపోటుతోనే సోంనాథ్‌ మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని