‘లూడో’లో ఓడించిందని భార్యపై దాడి

లాక్‌డౌన్‌ నేపథ్యంలో కాలక్షేపం కోసం భార్యాభర్తలు లూడో ఆడటం మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఆమె.. వరుసగా అతన్ని ఓడించింది. దీంతో ఆగ్రహం చెందిన అతను.. ఆమెను దుర్భాషలాడుతూ దాడికి పాల్పడ్డాడు. వెన్నుముకకు తీవ్ర గాయాలు కావడంతో బాధితురాలు ఆస్పత్రిపాలయ్యింది...

Published : 28 Apr 2020 00:42 IST

గుజరాత్‌లోని వడోదరలో ఘటన

వడోదర: లాక్‌డౌన్‌ నేపథ్యంలో కాలక్షేపం కోసం భార్యాభర్తలు లూడో ఆడటం మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఆమె.. వరుసగా అతన్ని ఓడించింది. దీంతో ఆగ్రహం చెందిన అతను.. ఆమెను దుర్భాషలాడుతూ దాడికి పాల్పడ్డాడు. వెన్నుముకకు తీవ్ర గాయాలు కావడంతో బాధితురాలు ఆస్పత్రిపాలయ్యింది. ఈ ఘటన గుజరాత్‌లోని వడోదర సమీపంలో చోటుచేసుకుంది. భార్య తనకంటే తెలివైందనే ఆత్మన్యూనతాభావానికి లోనై.. ఈ క్రమంలో అహం దెబ్బతినడంతో అతను ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు స్థానికంగా ఓ కౌన్సెలర్‌ వివరించారు. చికిత్సనంతరం ఆమె కొన్నాళ్లపాటు తన తల్లిదండ్రులవద్దే ఉండేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా లాక్‌డౌన్‌ వేళ మహిళలపై గృహ హింస కేసులు పెరుగుతున్నట్లు కొన్ని నివేదికలు వెల్లడిస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని