సైబర్‌ నేరగాళ్ల మాయాజాలం

సైబర్‌ నేరస్థులు రెచ్చిపోతున్నారు. గురువారం నగర సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు అందాయి.

Published : 01 May 2020 04:13 IST

న్యూస్‌టుడే, హైదరాబాద్‌: సైబర్‌ నేరస్థులు రెచ్చిపోతున్నారు. గురువారం నగర సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు అందాయి.
* న్యూ బోయిగూడకు చెందిన ఓ యువతి వాక్యూమ్‌ క్లీనర్‌ను అమ్మేందుకు ఓఎల్‌ఎక్స్‌లో ప్రకటన ఇచ్చారు. ఓ వ్యక్తి ఫోన్‌ చేసి వస్తువు తీసుకుంటానన్నాడు. క్యూఆర్‌ కోడ్‌ను రీడ్‌ చేస్తే ఖాతాలో డబ్బు జమవుతుందని చెప్పడంతో అలానే చేసి ఆ యువతి రూ.40 వేలు పోగొట్టుకుంది.

* నగరానికి చెందిన ఓ వ్యక్తికి తన సంస్థ యజమాని పేరుతో మెయిల్‌ వచ్చింది. రూ.27,700 కావాలని అందులో ఉండడంతో పంపించాడు. రెండురోజుల తర్వాత మరో మెయిల్‌ రావడంతో యజమానికి ఫోన్‌ చేయగా, మోసం బయటపడింది.

* పురానాపూల్‌కు చెందిన ఓ వ్యక్తి మాస్కులు అమ్మేందుకు జస్ట్‌ డయల్‌ యాప్‌లో ప్రకటన ఇచ్చాడు.  పెద్ద మొత్తంలో మాస్కులు కావాలని, ముందుగా నగదు చెల్లిస్తానని ఓ వ్యక్తి క్యూఆర్‌ కోడ్‌ పంపించాడు. స్కాన్‌ చేయగానే ఖాతాలోని రూ.55 వేలు మాయమయ్యాయి.

* జూబ్లీహిల్స్‌కు చెందిన ఓ కారు డ్రైవర్‌ ఫేస్‌బుక్‌లో ద్విచక్ర వాహన ప్రకటన చూసి సంప్రదించగా, వివిధ ఛార్జీల పేరిట క్యూఆర్‌ కోడ్‌లు పంపి రూ.78 వేలు లూటీ చేశారు.

* లాలాపేటకు చెందిన ఓ వ్యక్తి క్వికర్‌ యాప్‌లో బైకు ప్రకటన చూసి ఫోన్‌ చేశాడు. అవతలి వ్యక్తి ఆర్మీ జవానుగా పరిచయం చేసుకొని వాహనం బయటకు రావాలంటే ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని రూ.35 వేలు కాజేశాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని