కరోనాభయంతో అపార్ట్‌మెంట్‌పై నుంచి దూకి..

కరోనా వైరస్‌ భయంతో ఓ వ్యక్తి అపార్ట్‌మెంట్‌ బాల్కానీ నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్‌ రామంతాపూర్‌లో జరిగింది. గ్యాస్ట్రిక్‌ సమస్యతో...

Updated : 08 Dec 2022 15:34 IST

హైదరాబాద్‌: కరోనా వైరస్‌ భయంతో ఓ వ్యక్తి అపార్ట్‌మెంట్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్‌ రామంతాపూర్‌లో జరిగింది. గ్యాస్ట్రిక్‌ సమస్యతో బాధపడుతున్న 60 ఏళ్ల వ్యక్తికి  తరచు ఆయాసం రావడంతో కరోనా సోకిందేమోనని ఆందోళన చెందాడు. కుటుంబ సభ్యులు కింగ్‌కోఠి ఆసుపత్రికి తీసుకెళ్లగా..కరోనా లక్షణాలు లేవని వైద్యులు తేల్చారు. అయినప్పటికీ ఆందోళన చెందేవాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇవాళ ఉదయం వైద్య పరీక్షల కోసం సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రికి వెళ్దామని సిద్ధమవుతున్న తరుణంలో అపార్ట్‌మెంట్‌ పైనుంచి కిందకు దూకాడు. దీంతో తలపగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని