హెల్ప్లైన్కి ఫోన్ చేస్తే రెండు లక్షలు కొట్టేశారు
కరోనా వల్ల ప్రజలు ఇళ్ల నుంచి బయటికి వచ్చే పరిస్థితి లేకపోవడంతో నిత్యావసరాల కోసం ప్రజలు ఈ-కామర్స్ సంస్థలను ఆశ్రయిస్తున్నారు. దీంతో ప్రజలు సమాచారం కోసం సదరు సంస్థల హెల్ప్లైన్ నంబర్లకు ఫోన్ చేస్తుండంటంతో....
ముంబయి: కరోనా వల్ల ప్రజలు ఇళ్ల నుంచి బయటికి వచ్చే పరిస్థితి లేకపోవడంతో నిత్యావసరాల కోసం ప్రజలు ఈ-కామర్స్ సంస్థలను ఆశ్రయిస్తున్నారు. దీంతో ప్రజలు సమాచారం కోసం సదరు సంస్థల హెల్ప్లైన్ నంబర్లకు ఫోన్ చేస్తుండంటంతో....ఇదే అదనుగా కొందరు సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ వ్యాపారి తప్పుడు హెల్ప్లైన్ నంబరుకి ఫోన్ చేయడంతో ఆయన ఖాతా నుంచి రూ.2.22 లక్షలు కొట్టేశారు. ముంబయిలోని బోరివలి ప్రాంతంలో చోటుచేసుకున్న ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
ఏప్రిల్ 22న 40 ఏళ్ల వ్యాపారి ఆన్లైన్లో నిత్యావసరాలను ఆర్డర్ చేశాడు. కొద్దిరోజులకు సదరు కంపెనీ వాటిని డెలివరీ చేసింది. అయితే తను ఆర్డర్ చేసిన జాబితాలోని రూ.400 విలువ కలిగిన రెండు స్నాక్స్ ప్యాకెట్లు రాకపోవడంతో... వాటి గురించి విచారించేందుకు మే 1 తేది ఆన్లైన్లో సదరు సంస్థ హెల్ప్లైన్ నంబరు కోసం వెతికాడు. అందులో ఎక్కువ మంది ఫోన్ చేసినట్టు రేటింగ్ ఉన్న నంబరుకు ఆయన ఫోన్ చేశాడు. తనకు డెలివరీ కాని వస్తువుల గురించి ఫోన్లో అడగ్గా, అవతలి వ్యక్తి వ్యాపారి బ్యాంక్ ఖాతా, రిజిస్టర్డ్ ఫోన్ నంబర్, ఏటీఎం కార్డు సీవీవీ నంబరు అడిగాడు. తర్వాత వ్యాపారి ఫోన్కు ఒక లింక్ పంపి, దాన్ని మరో మొబైల్ నంబర్కి పంపమని సూచించాడు. అలానే యుపిఐ పిన్, ఓటిపి నంబరు అగడంతో వాటి వివరాలను ఆయన సదరు వ్యక్తికి తెలియజేశాడు. రెండు గంటల తర్వాత వ్యాపారి ఖాతా నుంచి రూ.2.25 లక్షలు విత్డ్రా అవ్వడంతో, మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు.
దీని గురించి సైబర్క్రైమ్ పోలీసు అధికారి మాట్లాడుతూ ‘‘వ్యాపారి బ్యాంక్ ఖాతా, ఓటీపీ వివరాలు తెలుసుకునేందుకు నేరస్థుడు తెలివిగా వ్యవహరించాడు. బ్యాంక్ ఖాతా, ఓటీపీ, సీవీవీ వివరాలు ఎవరితో షేర్ చేయవద్దని పదే పదే బ్యాంకులు ప్రజలను అభ్యర్థిస్తున్నప్పటికీ...కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుడటంతో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఇలాంటి ఘటనలు చూసయినా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి’’ అని అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో నాలుగు రోజుల క్రితం మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అనుచరుడి వద్ద భారీగా మద్యం స్వాధీనం చేసుకున్న ఘటన మరువక ముందే తాజాగా పొదలకూరు మండలం విరువూరులో మరో అనుచరుడు చిర్రా రాజగోపాల్రెడ్డి రైస్మిల్లులో మద్యం నిల్వలను బుధవారం సెబ్, పోలీసు అధికారులు సీజ్ చేశారు. -
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. -
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
సూర్యాపేట జిల్లా కోదాడలో జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సు బోల్తా
లక్షలాది కి.మీ. తిరిగిన బస్సులను స్క్రాబ్కు పంపకుండా రోడ్లపైకి పంపడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్లే. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం.. ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. -
పల్నాడులో తెదేపా కార్యకర్తలపై.. వైకాపా వర్గీయుల దాడి
`పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లలో వైకాపా వర్గీయుల దాడిలో తెదేపాకు చెందిన నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. -
గుంతలో పడి.. ఏకే 47 పేలి.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని 81 బెటాలియన్ బేస్ క్యాంపు పరిధిలో బుధవారం ఏకే-47 తుపాకి ప్రమాదవశాత్తు పేలడంతో విధుల్లో ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ ఎంవీ శేషగిరి(47) మృతి చెందారు. -
ఇంటర్లో ఫెయిలైన ఏడుగురు విద్యార్థుల బలవన్మరణం
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామని మనస్తాపంతో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM