యువకులపై సైబర్ వల
నగరంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు. రెండు వరుస ఘటనల్లో ఒకే రోజు రూ.లక్షకు పైగా సొమ్మును లూటీ చేశారు. స్నేహితురాలికి సాయం చేయబోయి ఓ యువకుడు మోసపోగా.. ఉద్యోగం వచ్చిందని ఎర వేసి మరో యువకుడి నుంచి కూడా సైబర్
హైదరాబాద్: నగరంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు. రెండు వరుస ఘటనల్లో ఒకే రోజు రూ.లక్షకు పైగా సొమ్మును లూటీ చేశారు. స్నేహితురాలికి సాయం చేయబోయి ఓ యువకుడు మోసపోగా.. ఉద్యోగం వచ్చిందని ఎర వేసి మరో యువకుడి నుంచి కూడా సైబర్ నేరగాళ్లు సొమ్మును కాజేశారు. హైదరాబాద్కు చెందిన ఫర్వేద్ అనే యువకుడు తన స్నేహితురాలికి సాయం చేసే క్రమంలో రూ.96 వేలు మోసపోయాడు. వివరాల్లోకి వెళ్తే.. ఫర్వేద్ తన స్నేహితురాలికి గూగుల్ పే ద్వారా రూ.2 వేలు పంపాడు. నగదు జమకాకపోవడంతో కస్టమర్ కేర్ నెంబర్ కోసం గూగుల్లో వెతికాడు. ట్రాన్సాక్షన్ పూర్తి కావాలంటే ఎనిడెక్స్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా సైబర్ నేరగాళ్లు సూచించారు. యాప్ ద్వారా రూ.25 వేలు పంపిస్తే తిరిగి పంపిస్తామని చెప్పారు. రూ. 25 వేలు పంపగా.. అదే అదునుగా మరో 4 ఓటీపీల ద్వారా రూ.96వేలు లూటీ చేశారు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
మరో ఘటనలో దూద్బౌలి ప్రాంతంలో జరిగింది. ప్రాసెసింగ్ ఫీజు పేరుతో సైబర్ నేరగాళ్లు ఓ మహిళను మోసం చేశారు. కొటక్ మహీంద్ర బ్యాంకులో ఉద్యోగం వచ్చిందంటూ హైదరాబాద్ దూద్బౌలికి చెందిన మనీష్ గౌడ్కు ఓ మహిళ కాల్ చేసింది. ప్రాసెసింగ్, ఇంటర్వ్యూ ఫీజు పేరుతో రూ.27 వేలు అడగ్గా.. మనీష్ సదరు అకౌంట్కు ఆ మొత్తాన్ని ట్రాన్ఫర్ చేశాడు. అనంతరం ఆ నెంబర్కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా.. ఎప్పటికీ స్పందించకపోవడంతో మోసపోయానని గ్రహించి సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సు బోల్తా
లక్షలాది కి.మీ. తిరిగిన బస్సులను స్క్రాబ్కు పంపకుండా రోడ్లపైకి పంపడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్లే. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం.. ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. -
పల్నాడులో తెదేపా కార్యకర్తలపై.. వైకాపా వర్గీయుల దాడి
`పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లలో వైకాపా వర్గీయుల దాడిలో తెదేపాకు చెందిన నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. -
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో నాలుగు రోజుల క్రితం మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అనుచరుడి వద్ద భారీగా మద్యం స్వాధీనం చేసుకున్న ఘటన మరువక ముందే తాజాగా పొదలకూరు మండలం విరువూరులో మరో అనుచరుడు చిర్రా రాజగోపాల్రెడ్డి రైస్మిల్లులో మద్యం నిల్వలను బుధవారం సెబ్, పోలీసు అధికారులు సీజ్ చేశారు. -
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. -
గుంతలో పడి.. ఏకే 47 పేలి.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని 81 బెటాలియన్ బేస్ క్యాంపు పరిధిలో బుధవారం ఏకే-47 తుపాకి ప్రమాదవశాత్తు పేలడంతో విధుల్లో ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ ఎంవీ శేషగిరి(47) మృతి చెందారు. -
ఇంటర్లో ఫెయిలైన ఏడుగురు విద్యార్థుల బలవన్మరణం
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామని మనస్తాపంతో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)