కత్తులతో పొడిచి యువకుడి దారుణ హత్య

పాత కక్షల నేపథ్యంలో యువకుడిని ప్రత్యర్థులు దారుణంగా అంతమొందించిన ఘటన సోమవారం మేడ్చల్‌ జిల్లా జగద్గిరిగుట్ట పరిధిలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. జగద్గిరిగుట్ట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఆర్‌పీ కాలనీలో

Published : 12 May 2020 01:16 IST

జగద్గిరిగుట్టలో ఘటన

జగద్గిరిగుట్ట (మేడ్చల్): పాత కక్షల నేపథ్యంలో యువకుడిని ప్రత్యర్థులు దారుణంగా అంతమొందించిన ఘటన సోమవారం మేడ్చల్‌ జిల్లా జగద్గిరిగుట్ట పరిధిలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. జగద్గిరిగుట్ట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఆర్‌పీ కాలనీలో నివాసముండే ఫయాజ్‌ (25) ఆటోడ్రైవర్‌గా పని చేసేవాడు. బంజారాహిల్స్‌ ప్రాంతానికి చెందిన ఫయాజ్ కొంతకాలంగా ఇక్కడ నివాసముంటున్నాడు. తాను నివాసముండే కాలనీలో కొందరితో అతడికి విభేదాలు ఉన్నాయి. ఈ క్రమంలో పలుమార్లు గొడవలు చోటు చేసుకున్నాయి. మూడు రోజుల క్రితం కూడా గొడవ పడ్డారు.

ఈ నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం ఫయాజ్‌ను అడ్డగించిన గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో వెంటాడారు. పలుచోట్ల పొడవడంతో తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ప్రాణ భయంతో పరుగులు తీసిన ఫయాజ్‌ ఓ ఇంటి ముందు పడిపోగా.. హంతకులు మరోసారి కత్తులతో పొడిచి పరారయ్యారు. దీంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. సుమారు 10 మంది ఈ దాడిలో పాల్గొన్నట్లు సమాచారం. బాలానగర్‌ ఏసీపీ పురుషోత్తం, జగద్గిరిగుట్ట సీఐ గంగారెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. క్లూస్‌ టీం సాయంతో మృతుడి వద్ద వస్తువులు, ఇతర ఆధారాలు సేకరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని