లాక్డౌన్: 300కి.మీ నడిచి..మార్గమధ్యంలోనే!
దేశవ్యాప్తంగా అమలవుతోన్న లాక్డౌన్ వలస కార్మికులకు విషాధాన్నే మిగులుస్తోంది. సరైన రవాణా సదుపాయాలు లేక ప్రజలు నడకదారిన వందల కి.మీ వెళ్తూ వారి స్వస్థలాలకు చేరుకుంటున్నారు. ఈ ప్రయత్నంలో కొందరు మార్గమధ్యంలోనే మృత్యువాతపడటం ఆందోళన కలిగిస్తోంది.
హైదరాబాద్: దేశవ్యాప్తంగా అమలవుతోన్న లాక్డౌన్ వలస కార్మికులకు విషాదాన్నే మిగులుస్తోంది. సరైన రవాణా సదుపాయాలు లేక ప్రజలు నడకదారిన వందల కి.మీ వెళ్తూ వారి స్వస్థలాలకు చేరుకుంటున్నారు. ఈ ప్రయత్నంలో కొందరు మార్గమధ్యంలోనే మృత్యువాతపడటం ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న బస్సులు, శ్రామిక్ రైళ్లలో వలస కార్మికులు ప్రయాణించాలని సూచిస్తున్నా.. వారి సొంత ప్రయత్నాలను మానడం లేదు. తాజాగా హైదరాబాద్ నుంచి ఒడిశాకు బయలుదేరిన ఓ యువకుడు 300కి.మీ నడచిన అనంతరం కుప్పకూలిపోయి ప్రాణాలు కోల్పోయాడు.
ఒడిశాలోని మల్కన్గిరి జిల్లాకు చెందిన ఓ 21ఏళ్ల యువకుడు హైదరాబాద్లో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. లాక్డౌన్ కారణంగా అన్ని వ్యాపారాలు మూతపడడంతో తన స్వస్థలానికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. తన ముగ్గురు స్నేహితులతో కలిసి ఈ ఆదివారం కాలినడకన వారి సొంత రాష్ట్రానికి ప్రయాణమయ్యారు. దాదాపు 300కి.మీ నడిచిన వీరంతా మరుసటి రోజు భధ్రాచలం చేరుకున్నారు. ఆ సమయంలో వీరిలో ఓ యువకుడు తీవ్ర ఛాతీనొప్పి, వాంతులతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో అతడి స్నేహితులు పోలీసుల సహాయంతో స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సరైన ఆహారం, నీరు లేకపోవడంతో వడదెబ్బ కారణంగా యువకుడు మృతిచెందినట్లు వైద్యులు ప్రాథమికంగా నిర్థారించారు. సోమవారం మధ్యాహ్నం నుంచి ఎటువంటి ఆహారం తీసుకోలేదని ఆ యువకులు చెప్పడం వలస కార్మికుల దుస్థితికి అద్దం పడుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో నాలుగు రోజుల క్రితం మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అనుచరుడి వద్ద భారీగా మద్యం స్వాధీనం చేసుకున్న ఘటన మరువక ముందే తాజాగా పొదలకూరు మండలం విరువూరులో మరో అనుచరుడు చిర్రా రాజగోపాల్రెడ్డి రైస్మిల్లులో మద్యం నిల్వలను బుధవారం సెబ్, పోలీసు అధికారులు సీజ్ చేశారు. -
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. -
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
సూర్యాపేట జిల్లా కోదాడలో జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సు బోల్తా
లక్షలాది కి.మీ. తిరిగిన బస్సులను స్క్రాబ్కు పంపకుండా రోడ్లపైకి పంపడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్లే. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం.. ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. -
పల్నాడులో తెదేపా కార్యకర్తలపై.. వైకాపా వర్గీయుల దాడి
`పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లలో వైకాపా వర్గీయుల దాడిలో తెదేపాకు చెందిన నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. -
గుంతలో పడి.. ఏకే 47 పేలి.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని 81 బెటాలియన్ బేస్ క్యాంపు పరిధిలో బుధవారం ఏకే-47 తుపాకి ప్రమాదవశాత్తు పేలడంతో విధుల్లో ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ ఎంవీ శేషగిరి(47) మృతి చెందారు. -
ఇంటర్లో ఫెయిలైన ఏడుగురు విద్యార్థుల బలవన్మరణం
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామని మనస్తాపంతో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్