భార్యా పిల్లలను చంపిన సీఆర్పీఎఫ్‌ కానిస్టేబుల్‌

అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన ఓ జవాన్‌ భార్య పిల్లలను పొట్టనపెట్టుకున్న హృదయవిదారక సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. అలహాబాద్‌ సీఆర్పీఎఫ్‌ క్యాంప్‌లో నివాసం ఉంటున్న...

Published : 17 May 2020 00:57 IST

దిల్లీ: ఓ జవాన్‌ తన భార్యా పిల్లలను పొట్టనపెట్టుకున్న సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. అలహాబాద్‌ సీఆర్పీఎఫ్‌ క్యాంప్‌లో నివాసం ఉంటున్న వీకే యాదవ్‌ అనే సీఆర్పీఎఫ్‌ కానిస్టేబుల్‌ అక్కడ డ్రైవర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం ఉదయం తన భార్యతో పాటు కూతురు, కుమారుడిని తుపాకీతో కాల్చి చంపాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు, పారామిలిటరీ ఉన్నతాధికారులు ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. వారిని ఎందుకు చంపాడనే విషయం తెలియరాలేదు. హత్యలు చేశాక అతడు ఇంట్లోకెళ్లి గడియ పెట్టుకున్నాడని పోలీసులు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతామని వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు