మరణశిక్ష @జూమ్ యాప్!
వీడియో కాలింగ్ యాప్ జూమ్ ద్వారా న్యాయస్థానం మరణశిక్ష విధించిన అరుదైన సంఘటన సింగపూర్లో చోటుచేసుకుంది.
సింగపూర్: వీడియో కాలింగ్ యాప్ ‘జూమ్’ ద్వారా న్యాయస్థానం మరణశిక్ష విధించిన ఘటన సింగపూర్లో చోటుచేసుకుంది. 2011 నాటి ఓ మాదక ద్రవ్యాల కేసులో దోషిగా తేలిన పునీతన్ గణేశన్(37) అనే వ్యక్తికి సింగపూర్లోని ఓ న్యాయస్థానం జూమ్ ద్వారా మరణశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. సింగపూర్లో అక్రమ మాదక ద్రవ్యాల వ్యాపారాన్ని క్షమించరాని నేరంగా పరిగణిస్తారనే సంగతి తెలిసిందే. కాగా, నిందితుడు పునీతన్ మలేసియాకు చెందినవాడు. ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో న్యాయస్థానం వీడియో సమావేశం ద్వారా విచారణ జరిపినట్టు అధికారులు వివరించారు.
అయితే కేసుల విచారణకు జూమ్ యాప్ను ఉపయోగించటంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. కాగా, తీర్పును వెలువరించేందుకు మాత్రమే జూమ్ యాప్ను వినియోగించారని... దీనిపై అభ్యంతరాలు లేవని దోషి తరఫు న్యాయవాది తెలిపారు. ఈ తీర్పును పైకోర్టులో అప్పీలు చేస్తామని చెప్పారు. ఏప్రిల్లో కొవిడ్-19 లాక్డౌన్ ప్రారంభమైన నాటి నుంచి సింగపూర్లో అనేక కేసుల విచారణలు వాయిదా పడ్డాయి. అత్యవసర కేసుల విషయంలో వీడియో సమావేశాల ద్వారా విచారణ కొనసాగిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!