ఎమ్మెల్సీ కుమారుడిగా పరిచయం.. వేధింపులు

కొండాపూర్‌కి చెందిన గృహిణి(30)ని ఓ వ్యక్తి.. ఎమ్మెల్సీ కుమారుడిగా పరిచయం చేసుకొని వేధింపులకు పాల్పడిన సంఘటన ఘట్‌కేసర్‌ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. ...

Updated : 22 May 2020 08:42 IST

ఘట్‌కేసర్‌: కొండాపూర్‌కి చెందిన గృహిణి(30)ని ఓ వ్యక్తి.. ఎమ్మెల్సీ కుమారుడిగా పరిచయం చేసుకొని వేధింపులకు పాల్పడిన సంఘటన ఘట్‌కేసర్‌ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. సదరు గృహిణికి కొంతకాలం క్రితం భరత్‌కుమార్‌ అలియాస్‌ చింటు అనే వ్యక్తి పరిచయమయ్యాడు. తాను ఎమ్మెల్సీ కొడుకునని ఆమెకు చెప్పాడు. వారి మధ్య పరిచయం స్నేహంగా మారింది. ఇదే అదనుగా భావించిన భరత్‌కుమార్‌.. ఆమెను రూ.15లక్షలు ఇవ్వాలని వేధించాడు. ఇవ్వకపోతే ఇద్దరూ కలిపి తీసుకున్న ఫొటోలను వైరల్‌ చేస్తానని బెదిరించాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. సీఐ రఘువీర్‌రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని