భర్త చెవిలోంచి..భార్య మెడలోకి బుల్లెట్
తుపాకీతో కాల్చుకుంటే ఆ బుల్లెట్ తలలో నుంచి బయటకు వచ్చి పక్కనే ఉన్న మరో వ్యక్తిలోకి చొచ్చుకుపోయిన ఘటన హరియాణాలో జరిగింది. సాధారణంగా ఇలాంటి సన్నివేశాలు సినిమాల్లో చూస్తుంటాం....
దిల్లీ: తుపాకీతో కాల్చుకుంటే ఆ బుల్లెట్ తలలో నుంచి బయటకు వచ్చి పక్కనే ఉన్న మరో వ్యక్తిలోకి చొచ్చుకుపోయిన ఘటన హరియాణాలో జరిగింది. సాధారణంగా ఇలాంటి సన్నివేశాలు సినిమాల్లో చూస్తుంటాం. నిజజీవితంలో చాలా అరుదుగా జరుగుతుంటాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హరియాణాలోని గురుగ్రామ్లో ఓ వ్యక్తి ఆవేశంతో తన తుపాకీతో చెవిలో కాల్చుకున్నాడు. అది అతని తలలో నుంచి బయటకు వచ్చి పక్కనే ఉన్న తన భార్య మెడలోకి చొచ్చుకుపోయింది. ప్రస్తుతం ఆ వ్యక్తి దిల్లీలోని సఫ్దర్జంగ్ ఆసుపత్రిలో విషమ పరిస్థితుల్లో ఉండగా.. గర్భవతి అయిన ఆయన భార్య మాత్రం ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది.
ఫైరదాబాద్కు చెందిన ఓ వ్యక్తి ఐదు నెలల క్రితం గురుగ్రామ్లోని రామ్పురాలో అద్దెకు ఉంటున్నాడు. ఇప్పటికే అతనికి రెండు పెళ్లిల్లయ్యాయి. 2017లో మొదటి భార్యకు దూరమైన అతను 2019లో మధురకు మకాం మార్చాడు. అక్కడ ఒక నిత్యావసర వస్తువుల దుకాణంలో పనిచేస్తున్న మరో మహిళతో పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహానికి దారి తీసింది. అయితే, గత కొంతకాలంగా పని లేకపోవడంతో ఇంట్లోనే ఉంటున్నాడు. దీంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ప్రస్తుతం రెండో భార్య ఐదు నెలల గర్భవతి కావడంతో గురుగ్రామ్లోని ఒక ఆసుపత్రిలో వైద్య పరీక్షల నిమిత్తం కారులో తీసుకెళ్లాడు. మార్గంమధ్యలో ఉద్యోగ విషయమై ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో సదరు వ్యక్తి ఆవేశంతో కారులో ఉన్న తుపాకీ తీసుకొని తన చెవిలో కాల్చుకున్నాడు. దీంతో తలలో నుంచి బయటకు వచ్చిన బుల్లెట్ పక్కనే ఉన్న అతని భార్య మెడలోకి దూసుకెళ్లింది. కారులో ఇద్దరు రక్తపు మడుగులో పడి ఉన్న విషయాన్ని గమనించిన కొంతమంది పోలీసులకు సమాచారమందించారు.
దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు దంపతులిద్దరిని దిల్లీలోని సప్ధర్జంగ్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ వ్యక్తి ఐసీయూలో విషమ పరిస్థితిలో ఉన్నాడు. అతని భార్య మాత్రం ప్రాణాల నుంచి బయటపడింది. ఉద్యోగం విషయమై ఇద్దరి మధ్య గొడవ జరుగుతోందని అతడి భార్య పేర్కొంది. కేసు నమోదు చేసిన పోలీసులు తుపాకీకి లైసెన్స్ ఉందో.. లేదో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్పై రాయిదాడి కేసు.. సతీష్ కస్టడీకి కోర్టు అనుమతి
సీఎం జగన్పై గులకరాయి కేసులో అరెస్టయి రిమాండ్లో ఉన్న నిందితుడు సతీష్ కుమార్ను కస్టడీకి అనుమతిస్తూ విజయవాడ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ప్రమాదవశాత్తు పేలిన ఏకే 47.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
ప్రమాదవశాత్తు తుపాకీ పేలడంతో సీఆర్పీఎఫ్కు చెందిన అసిస్టెంట్ కమాండెంట్ శేషగిరిరావు మృతిచెందారు. -
శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో ముగ్గురి అరెస్ట్
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో అనిశా మరో ముగ్గురిని అరెస్టు చేసింది. ఆయన ఆస్తులకు బినామీలుగా ఉన్న వ్యాపారులు గోదావర్తి సత్యనారాయణమూర్తి(62), పెంట భరత్కుమార్(30), ప్రైవేటు ఉద్యోగి పెంట భరణికుమార్(30)ను వ్యవహరిస్తున్నట్లు గుర్తించింది. -
నూడుల్స్ ప్యాకెట్లలో వజ్రాలు
నూడుల్స్ ప్యాకెట్లలో దాచిపెట్టిన వజ్రాలు, ప్రయాణికుల శరీర భాగాల్లో, బ్యాగేజీలో ఉంచి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని ముంబయి విమానాశ్రయంలో కస్టమ్స్ విభాగం స్వాధీనం చేసుకుంది. -
వైకాపా నాయకుడి ఇంట్లో 384 మద్యం సీసాలు
శ్రీకాకుళంలోని కత్తెరవీధికి చెందిన వైకాపా నాయకుడు పైడి మహేశ్వరరావు నివాసంలో దాచి ఉంచిన 384 మద్యం సీసాలను టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. -
ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురికి గాయాలు
ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయిన బస్సు అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన ఘటన సూర్యాపేట జిల్లా మునగాలలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. -
అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్యాయత్నం
అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆ దంపతులు వాటిని తీర్చే దారిలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా భర్త మృతి చెందారు. ఈ విషాదకర ఘటన పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం పారుపల్లిలో జరిగింది. -
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
హైదరాబాద్ నగరంలోని యూసఫ్గూడలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక యువతిపై బస్సు ఎక్కడంతో తీవ్రగాయాలతో ఆమె మృతిచెందింది.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్