అమ్మ లేదని.. ఇక తిరిగి రాదని తెలియక..
అమ్మ లేదు.. ఇక తిరిగి రాదని తెలియదు పాపం ఆ పసివాడికి. అందుకే రైల్వే స్టేషన్లో నిర్జీవంగా పడివున్న తన తల్లి మృతదేహంపై కప్పి.......
ముజఫర్పూర్: అమ్మ లేదు.. ఇక తిరిగి రాదని తెలియదు పాపం ఆ పసివాడికి. అందుకే రైల్వే స్టేషన్లో నిర్జీవంగా పడివున్న తన తల్లి మృతదేహంపై కప్పి ఉంచిన వస్త్రంతో ఆడుకుంటున్న దృశ్యం అందరి హృదయాలను కలిచివేస్తోంది. బిహార్లోని ముజఫర్పూర్ రైల్వే స్టేషన్లో చోటుచేసుకున్న ఈ హృదయ విదారక ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. కరోనా కట్టడికి విధించిన లాక్డౌన్తో ఉపాధి కోల్పోయి స్వస్థలాలకు బయల్దేరి వెళ్తున్న వలస కూలీల బతుకులు ఇలా మధ్యలోనే ఛిద్రమైపోతున్నాయి. తద్వారా ఆయా కుటుంబాలకు అంతులేని విషాదాన్ని మిగిలుస్తున్నాయి. తాజాగా ఓ మహిళ ఆకలితో అలమటించి, డీహైడ్రేషన్కు గురై నీరసించి మృతిచెందింది. ఆమె కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గుజరాత్లో శనివారం ఆమె రైలెక్కింది. సోమవారం ముజఫర్పూర్ స్టేషన్కు చేరుకున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో ఆమె మృతదేహాన్ని స్టేషన్లోని ప్లాట్ఫాం వద్ద ఉంచగా.. తన తల్లి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయిందని తెలియని ఆ పసి హృదయం ఆమెను లేపేందుకు ప్రయత్నించడం అక్కడ ఉన్నవారిని కలిచి వేసింది. ఈ దృశ్యం అక్కడి సీసీ ఫుటేజీలో రికార్డయింది.
లాక్డౌన్ కారణంగా దేశంలో పలు చోట్ల చిక్కుకుపోయిన లక్షలాది మంది వలస కూలీలు ఉపాధి కోల్పోయారు. చేతిలో చిల్లిగవ్వ లేక ఉన్నచోట ఆదరించే దిక్కు లేక ఎన్నో అవస్థలు ఎదుర్కొన్నారు. చివరకు తమ సొంతూరులోనైనా ఆసరా దొరుకుతుందేమోనన్న కొండంత ఆశతో వేల/ వందల కి.మీల మేర కాలినకడన, సైకిళ్లపైన బయల్దేరి వెళ్తున్నారు. ఇంకొందరైతే తమకు దొరికిన ట్రక్కో, ఆటోలనో పట్టుకొని సొంతూరు బాట పడుతున్నారు. ఈ క్రమంలో డస్సిపోయి, ఆకలికి తట్టుకోలేక, రోడ్డు ప్రమాదాలకు గురై అనేకమంది ఇంటికి చేరే లోపే ప్రాణాలు కోల్పోతున్న విషాద ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎంపై రాయి విసిరిన కేసులో నిందితుడు సతీష్ అరెస్టు
విజయవాడలో రోడ్షో నిర్వహిస్తుండగా సీఎం జగన్పై రాయితో దాడిచేసిన కేసులో ఒక నిందితుడిని పోలీసులు అరెస్టు చూపించారు. -
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
ఏటీఎంలలో నగదు నింపే సీఎంఎస్ వాహనం నుంచి రూ.64 లక్షలు చోరీ చేసిన ఓ వ్యక్తి వాటిని మర్రి చెట్టు తొర్రలో దాచిపెట్టిన ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో చోటుచేసుకుంది. -
డిప్యూటీ మేయర్ కారు షెడ్లో మద్యం
ఎన్నికల నామినేషన్ మొదటి రోజే వైకాపా నేతకు చెందిన స్థలంలో అక్రమంగా ఉంచిన 170 కేసుల మద్యం పట్టుబడింది. -
వేటగాళ్ల ఉచ్చుకు ఏనుగు బలి
వన్యప్రాణుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్ ఉచ్చు తగిలి ఓ ఏనుగు మృతి చెందింది. చిత్తూరు జిల్లా గంగవరం మండలం బూడిదపల్లె శివారులో గురువారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. -
అనిశాకు చిక్కిన అయిదుగురు ఉద్యోగులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం రెండు వేర్వేరు ఘటనల్లో అయిదుగురు అధికారులు లంచం తీసుకుంటూ అనిశాకు పట్టుబడ్డారు. -
బాలుడి మృతదేహాన్ని పాతిపెట్టి.. బతికున్నట్లు తల్లిని నమ్మించి..!
నాటు వైద్యం వికటించి ఓ బాలుడు మూడున్నరేళ్ల క్రితమే మృతిచెందగా.. విషయం బయటకు పొక్కనీయకుండా, అతను బతికే ఉన్నట్లు ఆ బాలుడి తల్లిని నమ్మిస్తూ ఆమె భర్త, నాటు వైద్యుడు కలిసి వేధించిన ఉదంతమిది. -
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ కుమార్తెపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె ప్రాణాలు కోల్పోయింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈసీ నిబంధనలకు విరుద్ధంగా వైకాపా సోషల్ మీడియా తీరు
-
హైదరాబాద్ విమానాశ్రయంలో ఏఏఐ వాటా విక్రయం?
-
20 నుంచి పవన్ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం
-
మహిళకు శస్త్రచికిత్స చేసి.. తల్లీ బిడ్డను కాపాడిన దర్శి అభ్యర్థి
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు