రసాయన పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం

మేడ్చల్‌ జిల్లా పరిధిలోని జీడిమెట్ల ఫేజ్‌-5లోని రసాయన పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం సంభవించడంతో మంటలు ఎగిసిపడుతున్నాయి. మంటల తీవ్రతకు రసాయన డ్రమ్ములు పేలుతూ పైకి ఎగిరిపడుతున్నాయి...

Updated : 08 Dec 2022 16:21 IST

షాపూర్‌నగర్‌: మేడ్చల్‌ జిల్లా పరిధిలోని జీడిమెట్ల ఫేజ్‌-5లోని రసాయన పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం సంభవించడంతో మంటలు ఎగిసిపడుతున్నాయి. మంటల తీవ్రతకు రసాయన డ్రమ్ములు పేలుతూ పైకి ఎగిరిపడుతున్నాయి. ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. మరికొంత మంది పరిశ్రమలోనే చిక్కుకున్నట్లు ప్రత్యక్ష్య సాక్షులు చెబుతున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకునక్న పేట్‌బషీరాబాద్ పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.


 

 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని