సినిమా పాత్రను అనుకరిస్తూ..మహిళలే లక్ష్యంగా..
యువతులను మోసం చేసి, వారి నుండి డబ్బు గుంజేందుకు ఓ ఘరానా మోసగాడు బాలీవుడ్ చిత్రం కబీర్ సింగ్లో వైద్యుడి పాత్రను అనుకరించాడు.
దిల్లీ: యువతులను మోసం చేసి వారి నుంచి డబ్బు గుంజేందుకు ఓ ఘరానా మోసగాడు బాలీవుడ్ చిత్రం ‘కబీర్ సింగ్’లో వైద్యుడి పాత్రను అనుకరించాడు. ఈ చిత్రం టాలీవుడ్ ‘అర్జున్ రెడ్డి’కి రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఈ వ్యక్తి తనకు తాను కీళ్ల వైద్య నిపుణుడిగా పేర్కొంటూ అమ్మాయిలను ఆకర్షించేవాడు. వారిని వివాహం చేసుకుంటానని.. వ్యక్తిగత చిత్రాలను, వీడియోలను పంపమని అడిగేవాడు. అనంతరం తన తల్లి వైద్యానికి అవసరమంటూ వారి నుంచి డబ్బు రాబట్టేవాడు. ఆ వ్యక్తి చేతిలో మోసపోయిన ఓ వైద్యురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు పోలీసులు పేర్కొన్నారు.
ఆనంద్ కుమార్ దిల్లీలో ఓ ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థను నడిపేవాడు. టిండర్, బంబల్ వంటి డేటింగ్ యాప్లు, పలు మ్యాట్రిమోని వెబ్సైట్లలో డాక్టర్ రోహిత్ గుజ్రాల్ పేరుతో ఓ నకిలీ ప్రొఫైల్ ఉంచాడు. తన వద్దకు మోడల్ కావాలని వచ్చిన ఓ యువకుడి చిత్రంతో ఈ ప్రొఫైల్ను క్రియేట్ చేశాడు. వీటి ద్వారా ఓ వైద్యురాలితో పరిచయం పెంచుకున్నాడు. ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి తన ఖాతాలో రూ.30,000 వేయించుకున్నాడు. అనంతరం ఆమె వ్యక్తిగత వీడియోలు, చిత్రాలను బయట పెడతానంటూ బ్లాక్ మెయిల్కు పాల్పడ్డాడు.
ఈ మోసగాడి మాయమాటలు నమ్మిన మరో యువతి రూ.5 లక్షలు రుణం తీసుకొని మరీ అతనికి ఇచ్చేందుకు సిద్ధపడింది. ఈ విధంగా గత నాలుగు నెలల్లో అనేక మందిని మోసం చేసినట్టు పోలీసు అధికారులు చెప్పారు. ఈ వ్యవహారాన్ని అతని యాప్లో సమాచారం ద్వారా కనిపెట్టిన లజ్పత్నగర్ పోలీసులు ఆనంద్ కుమార్ను అరెస్టు చేశారు. అతనికి సహకరించిన ప్రియం యాదవ్ అనే వ్యక్తిపై కూడా కేసు నమోదు చేశారు. ‘కబీర్సింగ్’ చిత్రం చూసిన అనంతరం వైద్యుడి వేషం వేయాలనే ఆలోచన వచ్చిందని నిందితుడు పోలీసు విచారణలో తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలీసుస్టేషన్ ఆవరణలోనే తెదేపా కార్యకర్తపై దాడి
పోలీసు స్టేషన్ ఆవరణలో వైకాపా నాయకులు హల్చల్ చేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల గ్రామానికి చెందిన కొందరు వైకాపా నాయకులు తెదేపా కార్యకర్త యూసఫ్పై స్టేషన్ ఆవరణలోనే దాడి చేశారు. -
బాలుడి పొట్టలోకి గాలికొట్టిన ఆకతాయి
ఓ ఆకతాయి వికృత చేష్టలకు గురైన బాలుడు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అనికేపల్లికి చెందిన బాలుడు(12) బుధవారం సాయంత్రం తోటి పిల్లలతో కలిసి వాలీబాల్ ఆడుతుండగా బంతిలో గాలి తగ్గింది. -
వైకాపా నాయకుడి బార్లో.. రూ.1.30 కోట్ల మద్యం స్వాధీనం
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరులో సెబ్ అధికారులు భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. -
గులకరాయి కేసులో నిందితుడిని కస్టడీకి తీసుకున్న పోలీసులు
గులకరాయి కేసులో నిందితుడు సతీష్కుమార్ను పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా