సింగరేణిలో ప్రమాదం: నలుగురి మృతి

ఉపరితల గని-1లోని ఫేజ్‌-2లో మంగళవారం ఉదయం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓబీ బ్లాస్టింగ్‌ సమయంలో మిస్‌ ఫైర్‌ కావడంతో ప్రమాదం జరిగింది...

Published : 03 Jun 2020 01:50 IST

రామగుండం: సింగరేణి ఓపెన్‌కాస్ట్‌ ఉపరితల గని-1లోని ఫేజ్‌-2లో మంగళవారం ఉదయం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓబీ బ్లాస్టింగ్‌ సమయంలో మిస్‌ ఫైర్‌ కావడంతో ప్రమాదం జరిగింది. ఈఘటనలో  ఉదయం షిఫ్టులో పనిచేస్తున్న నలుగురు ఒప్పంద కార్మికులు అక్కడి కక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలైనట్టు సమాచారం. ఇప్పటి వరకు మూడు మృత దేహాలను బయటకు తీశారు. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులు రాకేశ్‌ అంజయ్య, ప్రవీణ్‌, కుమార్‌ గా గుర్తించినట్టు సమాచారం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని