శ్రీశైలం ఆలయ అవినీతి..రూ.2.12 కోట్లు స్వాహా

శ్రీశైల మల్లన్న స్వామి ఆలయంలో అభిషేకం, ఆర్జిత సేవల విషయంలో చోటుచేసుకున్న కుంభకోణాన్ని పోలీసులు ఛేదించారు. ఈ అవినీతికి సంబంధించి 4 కేసుల్లో 27 మంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తం రూ. 2.12 కోట్లు అవినీతి

Updated : 02 Jun 2020 16:33 IST

శ్రీశైలం: శ్రీశైల మల్లన్న స్వామి ఆలయంలో అభిషేకం, ఆర్జిత సేవల విషయంలో చోటుచేసుకున్న కుంభకోణాన్ని పోలీసులు ఛేదించారు. ఈ అవినీతికి సంబంధించి 4 కేసుల్లో 27 మంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తం రూ. 2.12 కోట్లు అవినీతి జరిగిందని డీఎస్పీ వెంకట్రావు తెలిపారు. ఇప్పటివరకు రూ.83.40 లక్షల నగదు, ఒక కారును రికవరీ చేసుకున్నట్లు డీఎస్పీ వివరించారు. డబుల్‌ ప్రింటింగ్‌, ఫేక్‌ ఐడీలు సృష్టించి షిఫ్ట్‌ బిఫోర్‌ క్లోజింగ్‌, లాగిన్‌ ఐడీ ఛేంజ్‌ ద్వారా మోసాలకు పాల్పడినట్లు విచారణలో తేలిందని డీఎస్పీ చెప్పారు. అదుపులోకి తీసుకున్న నిందితుల్లో కొందరిని పోలీసు కస్టడీలోకి తీసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని