ఏనుగు మరణం: తిన్నది పైనాపిల్ కాదట...
గర్భిణిగా ఉన్న ఏనుగు మరణించిన ఘటనకు సంబంధించిన ఆధారాల సేకరణను అధికారులు కొనసాగించారు.
తిరువనంతపురం: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గర్భంతో ఉన్న ఏనుగు మృతి చెందిన అమానుష ఘటనలో విచారణ కొనసాగుతోంది. ఓ నిందితుడిని అదుపులోకి తీసుకున్న అనంతరం ఈ ఘటనకు సంబంధించిన పలు వివరాలను అటవీ అధికారులు వెల్లడించారు.
మరణించిన ఏనుగు తిన్నది అందరూ భావిస్తున్నట్లు పైనాపిల్ కాదని.. కొబ్బరికాయ అని అధికారులు స్పష్టం చేశారు. పేలుడు పదార్థాలతో కూడిన కొబ్బరికాయను తినటంతో దాని నోరు తీవ్రంగా గాయపడిందని వివరించారు. రోజుల తరబడి ఆహారం, నీరు కూడా తీసుకోలేని స్థితిలో... పాలక్కాడ్లోని వెల్లియార్ నదిలో ఆ గజరాజు ప్రాణాలు విడిచిందని తెలిపారు. సుమారు 20 రోజుల పాటు ఆహారాన్ని తీసుకొని ఉండదని అధికారులు అంచనా వేశారు.
అరెస్టైన నిందితుడు విల్సన్ రబ్బరు సేకరించే వృత్తిలో ఉన్నాడని.. విచారణలో భాగంగా నిందితుడిని పేలుడు పదార్ధాలు తయారుచేసిన ప్రాంతానికి తీసుకెళ్లినట్లు అటవీ అధికారులు చెప్పారు. అక్కడున్న ఓ షెడ్లో ఆ వ్యక్తి మరో ఇద్దరితో కలసి పేలుడు పదార్ధాలను తయారు చేశాడని తమ దర్యాప్తులో వెల్లడైనట్టు తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్న సంగతి తెలిసిందే. వారిని త్వరలోనే పట్టుకుంటామని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో తప్పక న్యాయం చేస్తామని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.
కేరళలో అడవి పంది వంటి జంతువులు తమ పంటలను నాశనం చేయకుండా కాపాడుకోవటానికి... స్థానికంగా తయారైన పేలుడు పదార్ధాలను పండ్లు, జంతువుల కొవ్వు వంటి వాటిలో కలిపి వాటికి అక్కడి రైతులు ఎరవేస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అప్పుల బాధతో రైతు బలవన్మరణం
అప్పుల బాధతో ఓ రైతు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. -
ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల ఘాతుకం
ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ఓ సీఆర్పీఎఫ్ జవాన్ మృతి చెందాడు. అసిస్టెంట్ కమాండెంట్ తీవ్రంగా గాయపడ్డాడు. -
ఆకర్షణీయమైన ఆఫర్లతో మోసాలు!
కంట్రీక్లబ్ సభ్యత్వం పేరిట నిర్వాహకులు ఆకర్షణీయమైన ఆఫర్లను తెరపైకి తెచ్చి రూ.కోట్ల మేర మోసాలకు పాల్పడుతున్నారంటూ హైదరాబాద్ సోమాజీగూడకు చెందిన న్యాయవాది శ్రీనివాస్ చౌదరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
యువతి నోరు మూయించి.. నెల రోజులు అత్యాచారం!
మధ్యప్రదేశ్లోని గుణ ప్రాంతంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. పొరుగింటి వ్యక్తి ఓ యువతిని నెల రోజులపాటు బంధించి, అత్యాచారానికి పాల్పడ్డాడు. -
అన్నమయ్య జిల్లాలో విషాదం.. ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
అన్నమయ్య జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ మహిళ తన ముగ్గురు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. -
స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యాటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు బుధవారం నీటిలోపడి మృతిచెందారు.
తాజా వార్తలు (Latest News)
-
సైబర్ టవర్స్ వద్ద చంద్రబాబు జన్మదిన వేడుకలు
-
ఆ ప్రాజెక్ట్ వదులుకున్నా.. దీపిక నాకు థ్యాంక్స్ చెప్పాలి: కరీనాకపూర్
-
ధోనీ ఆటే స్ఫూర్తి.. లేటుగా బ్యాటింగ్కు రావడానికి కారణముంది: ఫ్లెమింగ్
-
నిరంతరం రాష్ట్రం గురించి ఆలోచించే నేత చంద్రబాబు : పవన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
మారిన లోగో రంగు.. వివాదంలో దూరదర్శన్