‘ఆరోగ్య సేతు’ పేరుతో పాక్‌ సైబర్‌ దాడి

నకిలీ ‘ఆరోగ్య సేతు’ యాప్‌ పేరుతో లింక్‌లు పంపిస్తూ పాకిస్థాన్‌ నేరస్తులు కొత్తరకం చౌర్యానికి తెరలేపారు. రక్షణ, ప్రభుత్వ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని సమాచారం చోరీకి యత్నిస్తున్నట్లు నిఘా వర్గాలు రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించాయి. ప్రధానంగా

Published : 09 Jun 2020 02:08 IST

హైదరాబాద్: నకిలీ ‘ఆరోగ్య సేతు’ యాప్‌ పేరుతో లింక్‌లు పంపిస్తూ పాకిస్థాన్‌ నేరస్థులు కొత్తరకం చౌర్యానికి తెరలేపారు. రక్షణ, ప్రభుత్వ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని సమాచారం చోరీకి యత్నిస్తున్నట్లు నిఘా వర్గాలు రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించాయి. ప్రధానంగా ఆండ్రాయిడ్‌ ఫోన్లు వినియోగించే వారిని లక్ష్యంగా చేసుకున్నట్లు గుర్తించారు. మొబైల్‌కు వచ్చిన లింక్‌ను క్లిక్‌ చేస్తే ఫోన్‌లో ‘చాట్‌ మీ’ అనే యాప్‌ డౌన్‌లోడ్‌ అవుతోందని, దీని ద్వారా ఫోన్‌లో ఉన్న సమాచారమంతా వారి సర్వర్‌లో నిక్షిప్తం అవుతుందని నిఘా వర్గాలు తెలిపాయి. దీనిపై అప్రమత్తమైన తెలంగాణ మున్సిపల్‌ శాఖ కార్యదర్శి సురేందర్‌ రెడ్డి ఉద్యోగులు అనుమానిత లింక్‌లను క్లిక్‌ చేయొద్దని సూచించారు. ఈ మేరకు ఆయన సర్క్యులర్‌ జారీ చేశారు. ఎలాంటి అనుమానం ఉన్నా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని