‘ఆరోగ్య సేతు’ పేరుతో పాక్ సైబర్ దాడి
నకిలీ ‘ఆరోగ్య సేతు’ యాప్ పేరుతో లింక్లు పంపిస్తూ పాకిస్థాన్ నేరస్తులు కొత్తరకం చౌర్యానికి తెరలేపారు. రక్షణ, ప్రభుత్వ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని సమాచారం చోరీకి యత్నిస్తున్నట్లు నిఘా వర్గాలు రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించాయి. ప్రధానంగా
హైదరాబాద్: నకిలీ ‘ఆరోగ్య సేతు’ యాప్ పేరుతో లింక్లు పంపిస్తూ పాకిస్థాన్ నేరస్థులు కొత్తరకం చౌర్యానికి తెరలేపారు. రక్షణ, ప్రభుత్వ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని సమాచారం చోరీకి యత్నిస్తున్నట్లు నిఘా వర్గాలు రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించాయి. ప్రధానంగా ఆండ్రాయిడ్ ఫోన్లు వినియోగించే వారిని లక్ష్యంగా చేసుకున్నట్లు గుర్తించారు. మొబైల్కు వచ్చిన లింక్ను క్లిక్ చేస్తే ఫోన్లో ‘చాట్ మీ’ అనే యాప్ డౌన్లోడ్ అవుతోందని, దీని ద్వారా ఫోన్లో ఉన్న సమాచారమంతా వారి సర్వర్లో నిక్షిప్తం అవుతుందని నిఘా వర్గాలు తెలిపాయి. దీనిపై అప్రమత్తమైన తెలంగాణ మున్సిపల్ శాఖ కార్యదర్శి సురేందర్ రెడ్డి ఉద్యోగులు అనుమానిత లింక్లను క్లిక్ చేయొద్దని సూచించారు. ఈ మేరకు ఆయన సర్క్యులర్ జారీ చేశారు. ఎలాంటి అనుమానం ఉన్నా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అప్పుల బాధతో రైతు బలవన్మరణం
అప్పుల బాధతో ఓ రైతు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. -
ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల ఘాతుకం
ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ఓ సీఆర్పీఎఫ్ జవాన్ మృతి చెందాడు. అసిస్టెంట్ కమాండెంట్ తీవ్రంగా గాయపడ్డాడు. -
ఆకర్షణీయమైన ఆఫర్లతో మోసాలు!
కంట్రీక్లబ్ సభ్యత్వం పేరిట నిర్వాహకులు ఆకర్షణీయమైన ఆఫర్లను తెరపైకి తెచ్చి రూ.కోట్ల మేర మోసాలకు పాల్పడుతున్నారంటూ హైదరాబాద్ సోమాజీగూడకు చెందిన న్యాయవాది శ్రీనివాస్ చౌదరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
యువతి నోరు మూయించి.. నెల రోజులు అత్యాచారం!
మధ్యప్రదేశ్లోని గుణ ప్రాంతంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. పొరుగింటి వ్యక్తి ఓ యువతిని నెల రోజులపాటు బంధించి, అత్యాచారానికి పాల్పడ్డాడు. -
అన్నమయ్య జిల్లాలో విషాదం.. ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
అన్నమయ్య జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ మహిళ తన ముగ్గురు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. -
స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యాటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు బుధవారం నీటిలోపడి మృతిచెందారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈ పోలింగ్ ఏజెంట్ ఇంటర్నెట్ సెన్సేషన్.. ఎవరీ ఈశా అరోడా..?
-
ఆ సినిమా నుంచి గుణపాఠం నేర్చుకున్నా: సోనాలి బింద్రే
-
దిల్లీ కోటలో తొలి మ్యాచ్.. హైదరాబాద్ దూకుడు కొనసాగేనా?
-
కేంద్ర ఎన్నికల సంఘానికి కనకమేడల మరో లేఖ
-
సైబర్ టవర్స్ వద్ద చంద్రబాబు జన్మదిన వేడుకలు
-
ఆ ప్రాజెక్ట్ వదులుకున్నా.. దీపిక నాకు థ్యాంక్స్ చెప్పాలి: కరీనాకపూర్