మరణించినా వదల్లేదు..

లాక్‌డౌన్‌ సమయంలో మరణించిన వృద్ధుడి ఆన్‌లైన్‌ ఖాతా సైబర్‌ నేరస్థులకు కాసులు కురిపించింది. 15 రోజుల్లో రూ.15 లక్షలను బదిలీ చేసుకున్నారు. ఆబిడ్స్‌లో  ఉండే విశ్రాంత అధికారి క్రాంతికుమార్‌ కొద్దిరోజుల కిందట అనారోగ్యంతో మృతిచెందారు.

Published : 11 Jun 2020 05:48 IST

ఈనాడు, హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ సమయంలో మరణించిన వృద్ధుడి ఆన్‌లైన్‌ ఖాతా సైబర్‌ నేరస్థులకు కాసులు కురిపించింది. 15 రోజుల్లో రూ.15 లక్షలను బదిలీ చేసుకున్నారు. ఆబిడ్స్‌లో  ఉండే విశ్రాంత అధికారి క్రాంతికుమార్‌ కొద్దిరోజుల కిందట అనారోగ్యంతో మృతిచెందారు. అమెరికాలో ఉన్న ఆయన కుమారులు లాక్‌డౌన్‌ కారణంగా రాలేదు. క్రాంతికుమార్‌, ఆయన మనవరాలి పేరుతో బ్యాంకులో సంయుక్త ఖాతా ఉంది. దీని ఏటీఎం కార్డు వివరాలతో సైబర్‌ నేరస్థులు రూ.15 లక్షలను వేర్వేరు రోజుల్లో బదిలీ చేసుకున్నారు. క్రాంతికుమార్‌ మనవరాలు తమ బంధువైన డాక్టర్‌ సత్వాలేకర్‌కు ఫోన్‌ చేసి ఖాతా వివరాలు తెలుసుకోమని కోరింది. రూ.25 లక్షలు నగదు ఉండగా అందులో రూ.15లక్షలు మాయమవడం ఆయన గుర్తించారు. బుధవారం సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏటీఎం కార్డును ఎవరైనా కొట్టేశారా? ఎక్కడైనా పడితే తీసుకున్నారా? అన్న కోణంలో పోలీసులు పరిశోధిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని