బిహార్‌లో రోడ్డు ప్రమాదం.. ఏడుగురి మృతి

బిహార్‌లో నేడు జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మరణించగా, 12 మంది గాయపడ్డారు.

Updated : 15 Jun 2020 19:49 IST

గయ: బిహార్‌లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మరణించగా, 12 మంది గాయపడ్డారు. ఈ దుర్ఘటన గయ జిల్లా, అమాస్‌ గ్రామం వద్ద చోటుచేసుకుంది. రహదారిపై ప్రయాణిస్తున్న రెండు ఆటోలను అటుగా వస్తున్న ఓ ట్రక్కు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని