ఉపాధి పోయింది..ఊపిరి ఆగిపోయింది..
కుటుంబసభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పట్నా నగరం శివారు ప్రాంతమైన షాపూర్కు చెందిన ఆటోడ్రైవర్ లోన్ తీసుకుని ఆటో కొనుగోలు చేశాడు...
పట్నా: అతనో సాధారణ ఆటోడ్రైవర్..మూడు చక్రాలు తిరిగితే కానీ పూట గడవని పరిస్థితి. లాక్డౌన్ వల్ల ప్రజారవాణాపై ఆంక్షలు ఉండటంతో ఉపాధి కోల్పోయి ఇంటికే పరిమితమయ్యాడు. చేతిలో డబ్బు లేదు..తినటానికి ఇంట్లో తిండిలేదు. ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. ఏం చేసయినా తనను నమ్ముకున్న వారికి తిండి పెట్టాలనుకున్నాడు. అప్పుడే అతనికి ఒక ఆలోచన వచ్చింది..దాంతో తన కుటుంబానికి కావాల్సిన సరుకులు ఇంటి వద్దకే వచ్చి చేరాయి. ఇక తిండికి లోటు లేదు.. అయితే తినేందుకు తను మాత్రం లేడు. లాక్డౌన్తో ఉపాధి కోల్పోయిన ఎన్నో కుటుంబాల్లో చోటుచేసుకున్న పరిస్థితులకు అద్దం పట్టేలా ఉన్న ఈ ఘటన బిహార్ రాజధాని పట్నాలో చోటుచేసుకుంది.
కుటుంబసభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పట్నా నగరం శివారు ప్రాంతమైన షాపూర్కు చెందిన 25 ఏళ్ల ఆటోడ్రైవర్ లోన్ తీసుకుని ఆటో కొనుగోలు చేశాడు. కరోనా నియంత్రణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ అమలు చేయడంతో ఉపాధి కోల్పోయాడు. ప్రభుత్వం ఇచ్చే నిత్యావసరాలు పొందేందుకు అతని కుటుంబానికి రేషన్ కార్డు లేదు. ఎంత వెతికినా చేసేందుకు పని దొరకలేదు. తను చనిపోతే కుటుంబసభ్యులకు ప్రభుత్వం ఆదుకుంటుందని భావించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన రాష్ట్రంలో నిరుద్యోగానికి అద్దం పడుతోందని ప్రతిపక్ష పార్టీలు ఆందోళనలు చేపట్టాయి. దీంతో మేల్కొన్న అధికార యంత్రాంగం బాధితుడి కుటుంబానికి 25 కిలోల బియ్యం, గోధుమలు, నిత్యావసరాలను అందజేసింది. అయితే కొడుకు మృతితో ఆదాయం కోల్పోయిన తమ కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని మృతుడి తండ్రి విజ్ఞప్తి చేశారు. లాక్డౌన్ కారణంగా వేలాది మంది వలస కార్మికులు తమ సొంత ప్రాంతాలకు తిరుగుపయనమవుతున్నారు. వీరిలో ఎక్కువ మంది బిహార్ రాష్ట్రానికి చెందిన వారు. కొద్ది రోజుల క్రితం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పి ప్రజలకు ఉపాధి కల్పించాలని పారిశ్రామివేత్తలను కోరిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దర్యాప్తు బృందం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు నమోదు చేసింది. -
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో నాలుగు రోజుల క్రితం మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అనుచరుడి వద్ద భారీగా మద్యం స్వాధీనం చేసుకున్న ఘటన మరువక ముందే తాజాగా పొదలకూరు మండలం విరువూరులో మరో అనుచరుడు చిర్రా రాజగోపాల్రెడ్డి రైస్మిల్లులో మద్యం నిల్వలను బుధవారం సెబ్, పోలీసు అధికారులు సీజ్ చేశారు. -
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. -
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
సూర్యాపేట జిల్లా కోదాడలో జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సు బోల్తా
లక్షలాది కి.మీ. తిరిగిన బస్సులను స్క్రాబ్కు పంపకుండా రోడ్లపైకి పంపడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్లే. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం.. ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. -
పల్నాడులో తెదేపా కార్యకర్తలపై.. వైకాపా వర్గీయుల దాడి
`పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లలో వైకాపా వర్గీయుల దాడిలో తెదేపాకు చెందిన నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. -
గుంతలో పడి.. ఏకే 47 పేలి.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని 81 బెటాలియన్ బేస్ క్యాంపు పరిధిలో బుధవారం ఏకే-47 తుపాకి ప్రమాదవశాత్తు పేలడంతో విధుల్లో ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ ఎంవీ శేషగిరి(47) మృతి చెందారు. -
ఇంటర్లో ఫెయిలైన ఏడుగురు విద్యార్థుల బలవన్మరణం
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామని మనస్తాపంతో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం