కన్నబిడ్డనే కాటేశాడు!

కంచే చేను మేసిందన్నట్లుగా.. మానవ సంబంధాలు మంట కలిసిన ఘటన ఇది.. సభ్యసమాజం తల దించుకునే ఉదంతంమిది.. కంటికి రెప్పలా ఉండాల్సిన ఓ  తండ్రే తన కూతురికి కడుపు చేసి మానవత్వానికి మాయని

Published : 19 Jun 2020 01:31 IST

గర్భం దాల్చిన బాలిక

దుండిగల్‌ : కంచే చేను మేసిందన్నట్లుగా.. మానవ సంబంధాలు మంట కలిసిన ఘటన ఇది.. సభ్యసమాజం తల దించుకునే ఉదంతంమిది.. కంటికి రెప్పలా ఉండాల్సిన ఓ  తండ్రే తన కూతురికి కడుపు చేసి మానవత్వానికి మాయని మచ్చలా నిలిచాడు.  ప్రస్తుతం ఆ బాలిక 5 నెలల గర్భవతి. మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్‌లో ఈ దారుణం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. కర్ణాటక రాష్ట్రం బీదర్‌కు చెందిన వ్యక్తి (34) ఆరేళ్ల క్రితం బతుకుదెరువు నిమిత్తం నగరానికి కుటుంబంతో వలస వచ్చాడు. సూరారం శివాలయ నగర్‌లో ఉంటూ పెయింటర్‌గా పని చేస్తున్నాడు. ఇతనికి భార్య, కుమార్తె (14), కుమారుడు ఉన్నారు. కొన్ని నెలల క్రితం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటరిగా ఉన్న కుమార్తెను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం ఎవరికైనా చెప్తే అందరినీ చంపుతానని హెచ్చరించాడు. అడపాదడపా అఘాయిత్యానికి పాల్పడుతూనే ఉన్నాడు.
విషయం బయటపడిందిలా..
కొద్దిరోజుల క్రితం బాలికకు తీవ్ర కడుపునొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చూపించారు.  బాలిక గర్భం దాల్చినట్లు వైద్యులు ధ్రువీకరించారు. భర్త బెదిరింపులతో భార్య కిమ్మనలేదు. లాక్‌డౌన్‌ కారణంగా బాలికకు అబార్షన్‌ చేయించే ప్రయత్నాలు ఫలించలేదు. ప్రస్తుతం బాలిక ఐదు నెలల గర్భిణి కావడంతో ఇరుగుపొరుగు వారికి విషయం తెలిసి ఆ దంపతులను నిలదీశారు. దీంతో మొత్తం వ్యవహారం బయటపడింది. స్థానికులు నిందితుడిని స్తంభానికి కట్టేసి చితకబాది పోలీసులకు అప్పగించారు. కేసు దర్యాప్తులో ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని