కన్నబిడ్డనే కాటేశాడు!
కంచే చేను మేసిందన్నట్లుగా.. మానవ సంబంధాలు మంట కలిసిన ఘటన ఇది.. సభ్యసమాజం తల దించుకునే ఉదంతంమిది.. కంటికి రెప్పలా ఉండాల్సిన ఓ తండ్రే తన కూతురికి కడుపు చేసి మానవత్వానికి మాయని
గర్భం దాల్చిన బాలిక
దుండిగల్ : కంచే చేను మేసిందన్నట్లుగా.. మానవ సంబంధాలు మంట కలిసిన ఘటన ఇది.. సభ్యసమాజం తల దించుకునే ఉదంతంమిది.. కంటికి రెప్పలా ఉండాల్సిన ఓ తండ్రే తన కూతురికి కడుపు చేసి మానవత్వానికి మాయని మచ్చలా నిలిచాడు. ప్రస్తుతం ఆ బాలిక 5 నెలల గర్భవతి. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్లో ఈ దారుణం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. కర్ణాటక రాష్ట్రం బీదర్కు చెందిన వ్యక్తి (34) ఆరేళ్ల క్రితం బతుకుదెరువు నిమిత్తం నగరానికి కుటుంబంతో వలస వచ్చాడు. సూరారం శివాలయ నగర్లో ఉంటూ పెయింటర్గా పని చేస్తున్నాడు. ఇతనికి భార్య, కుమార్తె (14), కుమారుడు ఉన్నారు. కొన్ని నెలల క్రితం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటరిగా ఉన్న కుమార్తెను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం ఎవరికైనా చెప్తే అందరినీ చంపుతానని హెచ్చరించాడు. అడపాదడపా అఘాయిత్యానికి పాల్పడుతూనే ఉన్నాడు.
విషయం బయటపడిందిలా..
కొద్దిరోజుల క్రితం బాలికకు తీవ్ర కడుపునొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చూపించారు. బాలిక గర్భం దాల్చినట్లు వైద్యులు ధ్రువీకరించారు. భర్త బెదిరింపులతో భార్య కిమ్మనలేదు. లాక్డౌన్ కారణంగా బాలికకు అబార్షన్ చేయించే ప్రయత్నాలు ఫలించలేదు. ప్రస్తుతం బాలిక ఐదు నెలల గర్భిణి కావడంతో ఇరుగుపొరుగు వారికి విషయం తెలిసి ఆ దంపతులను నిలదీశారు. దీంతో మొత్తం వ్యవహారం బయటపడింది. స్థానికులు నిందితుడిని స్తంభానికి కట్టేసి చితకబాది పోలీసులకు అప్పగించారు. కేసు దర్యాప్తులో ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో నాలుగు రోజుల క్రితం మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అనుచరుడి వద్ద భారీగా మద్యం స్వాధీనం చేసుకున్న ఘటన మరువక ముందే తాజాగా పొదలకూరు మండలం విరువూరులో మరో అనుచరుడు చిర్రా రాజగోపాల్రెడ్డి రైస్మిల్లులో మద్యం నిల్వలను బుధవారం సెబ్, పోలీసు అధికారులు సీజ్ చేశారు. -
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. -
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
సూర్యాపేట జిల్లా కోదాడలో జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సు బోల్తా
లక్షలాది కి.మీ. తిరిగిన బస్సులను స్క్రాబ్కు పంపకుండా రోడ్లపైకి పంపడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్లే. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం.. ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. -
పల్నాడులో తెదేపా కార్యకర్తలపై.. వైకాపా వర్గీయుల దాడి
`పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లలో వైకాపా వర్గీయుల దాడిలో తెదేపాకు చెందిన నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. -
గుంతలో పడి.. ఏకే 47 పేలి.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని 81 బెటాలియన్ బేస్ క్యాంపు పరిధిలో బుధవారం ఏకే-47 తుపాకి ప్రమాదవశాత్తు పేలడంతో విధుల్లో ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ ఎంవీ శేషగిరి(47) మృతి చెందారు. -
ఇంటర్లో ఫెయిలైన ఏడుగురు విద్యార్థుల బలవన్మరణం
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామని మనస్తాపంతో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు.