సంచిలో చుట్టి.. చెరువులో పడేసి
గుర్తుతెలియని మహిళ దారుణ హత్యకు గురైంది. తలపై మోది హతమార్చిన దుండగులు మృతదేహాన్ని ప్లాస్టిక్ సంచుల్లో చుట్టి బోరబండలోని సున్నం చెరువులో పడేశారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన వివరాలను....
మహిళ దారుణ హత్య
సనత్నగర్, న్యూస్టుడే: గుర్తుతెలియని మహిళ దారుణ హత్యకు గురైంది. తలపై మోది హతమార్చిన దుండగులు మృతదేహాన్ని ప్లాస్టిక్ సంచుల్లో చుట్టి బోరబండలోని సున్నం చెరువులో పడేశారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన వివరాలను సనత్నగర్ సీఐ చంద్రశేఖర్రెడ్డి తెలిపారు. శనివారం ఉదయం 10 గంటలకు సున్నం చెరువులో ఓ మృతదేహం ఉన్నట్లు స్థానికుల నుంచి సమాచారం అందింది. చెరువులో నుంచి మహిళ(30-40) మృతదేహాన్ని వెలికి తీయించాం. కాళ్లూ చేతులు కట్టి మృతదేహాన్ని ప్లాస్టిక్ బస్తాల్లో పెట్టి చెరువులో పడేశారు. తలపై బలంగా మోదినట్లు గాయాలున్నాయి. హత్య జరిగి నాలుగైదు రోజులై ఉంటుంది. మృతదేహం కుళ్లిపోయింది. ఒంటిపై కుర్తా పైజామా ఉంది. చేతిపై పచ్చబొట్టు ఆధారంగా ఆచూకీ తెలుసుకొనేందుకు యత్నిస్తున్నాం. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించామని సీఐ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా