పెద్దపల్లి ఎమ్మెల్యే సోదరిది ఆత్మహత్యే

పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్‌ రెడ్డి సోదరి కుటుంబం మృతిని పోలీసులు ఆత్మహత్యగా నిర్ధరించారు. జనవరి 27న ఎస్సారెస్పీ కాలువలో మూడు మృతదేహాలు లభ్యమైన విషయం తెలిసిందే. మృతులు ఎమ్మెల్యే సోదరి రాధతో పాటు భర్త సత్యనారాయణ రెడ్డి,

Updated : 24 Nov 2022 15:05 IST

పోలీసుల నిర్ధరణ

కరీంనగర్‌: పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్‌ రెడ్డి సోదరి కుటుంబం మృతిని పోలీసులు ఆత్మహత్యగా నిర్ధరించారు. జనవరి 27న ఎస్సారెస్పీ కాలువలో మూడు మృతదేహాలు లభ్యమైన విషయం తెలిసిందే. మృతులు ఎమ్మెల్యే సోదరి రాధతో పాటు భర్త సత్యనారాయణ రెడ్డి, కుమార్తె వినయశ్రీల అని అప్పుడు గుర్తించారు. ఈ కేసుల విచారణలో భాగంగా...

సూసైడ్ నోట్‌‌ లభ్యమైంది. దీనిని పరీక్షల కోసం పోలీసులు రాత నిపుణల వద్దకు పంపించారు. పరిశోధనలో సూసైడ్‌ నోట్‌ను వారే రాసుకున్నట్లు తేలిందని సీపీ కమలాసన్‌ రెడ్డి తెలిపారు. దీంతో ఆ ముగ్గురి మృతిని ఆత్మహత్యగా తేల్చామని సీపీ తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని