పాముతో కాటేయించాలని, సుపారీ ఇచ్చి చంపించాలని..
కట్టుకున్న భార్యను పాముతో కాటేయించాలని.. కిరాయి రౌడీలతో హత్య చేయించాలని.. కారుతో యాక్సిడెంట్ చేయించాలని.. ఇలా పలు పన్నాగాలు పన్నిన అమిత్ అగర్వాల్..
67 పేజీల సూసైడ్ నోట్.. ఆసక్తికర విషయాలు
కోల్కతా: కట్టుకున్న భార్యను పాముతో కాటేయించాలని.. కిరాయి రౌడీలతో హత్య చేయించాలని.. కారుతో యాక్సిడెంట్ చేయించాలని.. ఇలా పలు పన్నాగాలు పన్నిన అమిత్ అగర్వాల్ వారెవరిని నమ్ముకోకూడదని తానే హత్య చేయాలని నిర్ణయించుకొన్నట్లు సూసైడ్ నోట్లో విస్తుపోయే విషయాలు వెల్లడించాడు. విడాకులు ఇచ్చేందుకు సిద్ధపడిన భార్యను హతమార్చేందుకు ఆరు నెలలుగా హత్య చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నాడు. తాను రాసిన 67 పేజీల సూసైడ్ నోట్కు ‘మహాభారత్ ఆఫ్ మై లైఫ్’ అని పేరు కూడా పెట్టాడు. కోల్కతా పోలీసుల వివరాల ప్రకారం.. బెంగళూరుకు చెందిన చార్టెడ్ అకౌంటెంట్ అమిత్ అగర్వాల్ (42) తన భార్య శిల్పిని ఆదివారం హత్య చేశాడు. పదేళ్ల కుమారుడితో కలిసి సోమవారం విమానంలో కోల్కతాకు వెళ్లాడు. విమానాశ్రయానికి మిత్రుడిని రప్పించుకొని కుమారుడిని అక్కడితన అన్నయ్య ఇంట్లో అప్పజెప్పాల్సిందిగా కోరాడు. సాయంత్రం పట్టణంలోని అత్తామామల ఇంటికి వెళ్లి వారితో గొడవపడి అత్త లలితా దండానియా(65)ను తుపాకితో కాల్చాడు. మామ సుభాష్ దండానియా (70) ఎలాగోలా తప్పించుకున్నట్లు కోల్కతా పోలీసు డిటెక్టివ్ విభాగం సీనియర్ అధికారి పేర్కొన్నారు.
అధికారి మరిన్ని విషయాలు వెల్లడిస్తూ.. గత రెండేళ్లుగా భార్యాభర్తలు విడిగా ఉంటున్నారు. వారి మధ్య విడాకులకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కిరాయి గుండాలతో భార్యను పంపించేందుకు అగర్వాల్ లాక్డౌన్కు ముందు బిహార్కు వెళ్లాడు. పాముతో కాటేయించాలనే ఉద్దేశంతో తమిళనాడుకు వెళ్లొచ్చాడు. కారుతో యాక్సిడెంట్ చేయించి చంపించాలని కూడా అనుకున్నాడు. కానీ వారెవరిని నమ్ముకోకూడదనుకొని తానే హత్య చేసేందుకు సిద్ధమైనట్లు మరణ వాంగ్మూలంలో పేర్కొన్నాడని అధికారి తెలిపారు.
కోల్కతాలో అగర్వాల్కి ఓ ఫ్లాట్ ఉందని గతంలో ఇక్కడికి వచ్చినప్పుడే తుపాకిని కొనుగోలు చేసి ఉంటాడని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. అగర్వాల్ తన భార్య బంధువులందరిని హత్య చేసేందుకే నిర్ణయించుకొనే కోల్కతాకు వచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గురుగ్రామ్లో ఉన్న తన బావమరిది వినీత్ను కూడా కోల్కతాకు రావాల్సిందిగా కోరాడు. కానీ అతడు రాలేకపోయాడు. బెంగళూరులో శిల్పి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అగర్వాల్ ఆమెను గొంతుకోసి హత్య చేసినట్లుగా బెంగళూరు పోలీసులు భావిస్తున్నారు. ఫ్లాట్లో వారి మధ్య పెనుగులాట జరిగినట్లు గుర్తించారు. అగర్వాల్ కుమారుడిని అపార్టమెంట్లోని గెస్ట్ హౌస్లో ఉంచి, తరువాత భార్య ఫ్లాట్కు వెళ్లి ఆమెను హత్య చేసి ఉంటాడని ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు పోలీసులు వెల్లడించారు. హత్య చేసి నిందితుడు రాత్రంతా గెస్ట్ రూమ్లోనే ఉండి ఉదయం కోల్కతా వెళ్లినట్లు పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రైలు ప్రయాణికుడి సెల్ఫీతో డెత్ మిస్టరీని ఛేదించిన పోలీసులు
మహారాష్ట్రలోని కల్యాణ్లో ఓ రైలు ప్రయాణికుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసును దర్యాప్తు చేస్తున్న క్రమంలో పోలీసులు మరో కేసులోని డెత్ మిస్టరీని ఛేదించారు. -
‘ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావు చెప్పినట్లే చేశా!’
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సీఐ గట్టుమల్లు విచారణ ముగిసింది. గురువారం అర్ధరాత్రి వరకు ఆయన్ను దర్యాప్తు బృందం విచారించింది. -
నకిలీ కరెన్సీ నోట్లతో దొరికిన వైకాపా నేత బంధువు
వైకాపా నేత బావమరిది నకిలీ కరెన్సీ నోట్లతో ప్రభుత్వ మద్యం దుకాణంలో మద్యం కొనుగోలు చేయబోయి అక్కడి సిబ్బందికి దొరికిపోయాడు. -
రేటింగుల పేరుతో మోసం కేసులో రూ.32 కోట్ల జప్తు
పర్యాటక ప్రాంతాల్లో హోటళ్లు, రిసార్టులకు రేటింగ్ ఇస్తే మంచి కమీషన్ ముట్టజెబుతామని భారీ మోసానికి పాల్పడిన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు దేశవ్యాప్తంగా 580 బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.32.34 కోట్ల నగదును జప్తు చేశారు. -
ట్యాపింగ్ పాపంలో కీలక వికెట్
ఫోన్ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్ టాస్క్ఫోర్స్ డీసీపీగా, ఉద్యోగ విరమణ అనంతరం అక్కడే ఓఎస్డీగా సుదీర్ఘకాలం పనిచేసిన రాధాకిషన్రావును పోలీసులు అరెస్ట్ చేశారు. -
రొయ్యల ప్రాసెసింగ్ కంపెనీలో తనిఖీలు
బాపట్ల జిల్లా చీరాల మండలం కావూరివారిపాలెం పంచాయతీ పరిధిలో ఉన్న రాయల్ మెరైన్ రొయ్యల ప్రాసెసింగ్ కంపెనీలో గురువారం పలు శాఖల అధికారులు తనిఖీలు చేపట్టారు. -
ముంబయిలో రూ.6 కోట్ల డ్రగ్స్ స్వాధీనం
మహారాష్ట్ర రాజధాని ముంబయిలో పోలీసులు వేర్వేరు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి నలుగురు వ్యక్తుల నుంచి 3 కిలోల మెఫెడ్రోన్ను స్వాధీనం చేసుకున్నారు. -
పరీక్షలో జవాబు పత్రం చూపించలేదని ఘోరం
పదో తరగతి పరీక్షలో తమకు జవాబు పత్రం చూపించలేదన్న ఆగ్రహంతో ఓ విద్యార్థిపై ముగ్గురు సహచర విద్యార్థులు తీవ్రంగా దాడి చేసి కత్తితో గాయపరిచిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. -
అయిదేళ్ల బాలికపై హత్యాచారం.. నిందితుడి అరెస్టు
దేశ రాజధానిలో దిల్లీలో ఘోరం చోటుచేసుకుంది. అయిదేళ్ల చిన్నారిపై ఓ ఫ్యాక్టరీ కార్మికుడు అత్యాచారానికి పాల్పడి హతమార్చాడు. -
గ్రూప్-1 ఉద్యోగాల పేరిట టోకరా.. పోలీసుల అదుపులో నిందితుడు
‘గ్రూప్-1’ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ భారీగా డబ్బులు వసూలు చేసి మోసగించిన ముఠాలో ఓ నిందితుడిని వరంగల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
కోటాలో నీట్ విద్యార్థిని ఆత్మహత్య
రాజస్థాన్లో పోటీ పరీక్షల శిక్షణ సంస్థలకు నెలవైన కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు ఆగడం లేదు. -
ఛత్తీస్గఢ్ అడవుల్లో భారీగా ఎదురుకాల్పులు
మహారాష్ట్ర-ఛత్తీస్గఢ్ సరిహద్దున కాంకర్ అడవుల్లో పోలీసులు, మావోయిస్టులకు మధ్య బుధ, గురువారాల్లో భారీగా ఎదురుకాల్పులు జరిగాయి. -
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
ఎయిర్ బ్లోయర్ నాజిల్ను మర్మాంగంలోకి చొప్పించడంతో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.
తాజా వార్తలు (Latest News)
-
సిరియాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. 42 మంది మృతి
-
లోక్సభ ఎంపీల్లో 225 మందిపై క్రిమినల్ కేసులు: ఏడీఆర్
-
బాబాయిని చంపిన వ్యక్తికి ఎంపీ టికెట్.. చెల్లెలుపై కేసులు: చంద్రబాబు
-
ఆ నగ్న ఊరేగింపు ఫొటోకు అవార్డు.. నెట్టింట ఆగ్రహం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది: కేటీఆర్