తిరుపతిలో భారీ చోరీ.. రెచ్చిపోయిన దొంగలు

చిత్తూరు జిల్లా తిరుపతిలో దొంగలు రెచ్చిపోయారు. నగరంలోని......

Published : 25 Jun 2020 02:43 IST

తిరుపతి: చిత్తూరు జిల్లా తిరుపతిలో దొంగలు రెచ్చిపోయారు. నగరంలోని గాయత్రినగర్‌లో భారీ చోరీకి పాల్పడ్డారు. ఇంట్లోకి చొరబడి రూ.10.70లక్షల విలువైన బంగారం, రూ.3.75లక్షల నగదును ఎత్తుకెళ్లారు. తలుపులు తొలగించి ఇంట్లో చొరబడి దోపిడీకి పాల్పడ్డారు. అయితే, ఈ చోరీని సాయంత్రంవరకు ఇంటి యజమాని గుర్తించలేకపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ఎమ్మార్‌పల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని