కరోనా నియంత్రణకు నిధుల పేరుతో మోసం
సైబర్ నేరగాళ్ల మోసాలు రోజురోజుకీ పెచ్చురేగిపోతున్నాయి. తాజాగా ఓటీపీ, ఓఎల్ఎక్స్ పేర్లతో రూ.9లక్షలు, గిఫ్ట్, ఓటీపీ, ఓఎల్ఎక్స్ పేర్లతో సైబర్ నేరగాళ్లు రూ.20లక్షలు కాజేసిన వైనం వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు.
సైబర్ నేరగాళ్ల సరికొత్త పంథా
హైదరాబాద్: సైబర్ నేరగాళ్ల మోసాలు రోజురోజుకీ పెచ్చురేగిపోతున్నాయి. తాజాగా ఓటీపీ, ఓఎల్ఎక్స్ పేర్లతో రూ.9లక్షలు, గిఫ్ట్, ఓటీపీ, ఓఎల్ఎక్స్ పేర్లతో సైబర్ నేరగాళ్లు రూ.20లక్షలు కాజేసిన వైనం వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. కరోనా నియంత్రణకు నిధులు ఇస్తామని సైబర్ నేరగాళ్లు మోసానికి పాల్పడినట్టు బాధితులు వాపోయారు. యూకేలో మత బోధకుడినంటూ హైదరాబాద్కు చెందిన మహిళతో పరిచయం పెంచుకుని అనంతరం నేరగాళ్లు ఆమెతో వాట్సప్ ఛాటింగ్ చేశారని వెల్లడించారు. దిల్లీ విమానాశ్రయం నుంచి మాట్లాడుతున్నామని నగదు, బహుమతులు పంపుతున్నట్లు నమ్మబలికారని వివరించారు. మీకు డబ్బు వచ్చిందని కస్టమ్స్, ఐటీ, జీఎస్టీ కట్టాలని నేరగాళ్లు నమ్మించారని పేర్కొన్నారు. కస్టమ్స్, ఐటీ, జీఎస్టీ కట్టకపోతే క్రిమినల్ కేసు పెడతామంటూ బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఆన్లైన్ ద్వారా రూ.11లక్షలు బదిలీ చేసిన మహిళ వారి నుంచి స్పందన లేకపోవడంతో మోసపోయినట్టు గుర్తించి సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దర్యాప్తు బృందం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు నమోదు చేసింది. -
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో నాలుగు రోజుల క్రితం మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అనుచరుడి వద్ద భారీగా మద్యం స్వాధీనం చేసుకున్న ఘటన మరువక ముందే తాజాగా పొదలకూరు మండలం విరువూరులో మరో అనుచరుడు చిర్రా రాజగోపాల్రెడ్డి రైస్మిల్లులో మద్యం నిల్వలను బుధవారం సెబ్, పోలీసు అధికారులు సీజ్ చేశారు. -
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. -
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
సూర్యాపేట జిల్లా కోదాడలో జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సు బోల్తా
లక్షలాది కి.మీ. తిరిగిన బస్సులను స్క్రాబ్కు పంపకుండా రోడ్లపైకి పంపడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్లే. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం.. ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. -
పల్నాడులో తెదేపా కార్యకర్తలపై.. వైకాపా వర్గీయుల దాడి
`పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లలో వైకాపా వర్గీయుల దాడిలో తెదేపాకు చెందిన నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. -
గుంతలో పడి.. ఏకే 47 పేలి.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని 81 బెటాలియన్ బేస్ క్యాంపు పరిధిలో బుధవారం ఏకే-47 తుపాకి ప్రమాదవశాత్తు పేలడంతో విధుల్లో ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ ఎంవీ శేషగిరి(47) మృతి చెందారు. -
ఇంటర్లో ఫెయిలైన ఏడుగురు విద్యార్థుల బలవన్మరణం
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామని మనస్తాపంతో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
-
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్
-
(ADVT) జేఈఈ మెయిన్ ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 1st ర్యాంక్ నారాయణదే
-
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్