సెల్ఫీ మోజులో ఐదుగురు మృతి

సరదా సెల్ఫీ మహారాష్ట్రలో ఐదుగురి ప్రాణాలను బలితీసుకుంది. పాల్గర్‌ జిల్లాలోని కాల్‌మాండవి జలపాతంలోకి దిగిన ఇద్దరు వ్యక్తులు సెల్ఫీ..

Published : 04 Jul 2020 01:33 IST

జలపాతంలో కొట్టుకుపోయి మృత్యువాత

ముంబయి: సరదా సెల్ఫీ మహారాష్ట్రలో ఐదుగురి ప్రాణాలను బలితీసుకుంది. పాల్గర్‌ జిల్లాలోని కాల్‌మాండవి జలపాతంలోకి దిగిన ఇద్దరు వ్యక్తులు సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించారు. కానీ నీటి ఉద్ధృతి అధికంగా ఉండటంతో, ఆ ప్రవాహ వేగాన్ని వారు తట్టుకోలేకపోయారు. ఆ ప్రవాహంలో మునిగిపోయారు. కొట్టుకుపోతున్న వారిని కాపాడేందుకు నీటిలోకి దిగిన మరో ముగ్గురు సైతం ప్రవాహ ధాటికి నిలవలేకపోయారు. ప్రమాదంలో ఆ ఐదుగురు కూడా మృత్యువాత పడ్డారు. ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది మృతదేహాలను వెలికితీశారు. పోస్టుమార్టం నిమిత్తం వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే మృతిచెందిన వారికి ఈత బాగా వచ్చు కానీ, అధిక నీటి ప్రవాహం వల్లే వారు మునిగిపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేపట్టినట్లు వారు తెలిపారు.
 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని