చిత్తూరు జిల్లాలో  ప్రమాదం: ఐదుగురి మృతి

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కంభంవారిపల్లె .....

Published : 03 Jul 2020 22:13 IST

చిత్తూరు: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కంభంవారిపల్లె మండలం సొరకాయలపేట చెరువు కట్టపై జరిగిన ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.  చెరువు కట్టపై వ్యాను, ఆటో ఢీకొని నలుగురు అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. క్షతగాత్రులను పీలేరులోని ఆస్పత్రికి తరలించగా.. మరో వ్యక్తి చికిత్సపొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. దీంతో మృతుల సంఖ్య ఐదుకి చేరగా.. వీరిలో ముగ్గురు మహిళలే ఉన్నారు. మృతులంతా కలకడ మండలం కొత్తగాండ్లపల్లి వాసులుగా పోలీసులు గుర్తించారు. వీరంతా పీలేరు ఆస్పత్రిలో చనిపోయిన బంధువు చివరి చూపునకు వెళ్లి వస్తుండగా ఈ  విషాదం చోటుచేసుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని