కిల్లర్ గ్యాంగ్స్టర్: పోలీసులే ఉప్పందించారు..?
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాన్పూర్ ఎన్కౌంటర్లో 8మంది పోలీసులు మృత్యువాతపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో స్థానిక పోలీసుల పాత్ర కూడా ఉన్నట్లు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. ప్రధాన నిందితుడైన గ్యాంగ్స్టర్ వికాస్ దూబేకు స్థానిక పోలీసులే సహాయం చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని సమాచారం.
అరెస్టు సమాచారాన్ని గ్యాంగ్స్టర్కు తెలిపిన స్థానిక పోలీసులు?
అప్రమత్తమై పోలీసులనే కాల్చివేసిన వికాస్ దూబే
తమ సిబ్బంది పాత్రపై యూపీ పోలీసుల దర్యాప్తు
లఖ్నవూ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాన్పూర్ ఎన్కౌంటర్లో 8మంది పోలీసులు మృత్యువాతపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో స్థానిక పోలీసుల పాత్ర కూడా ఉన్నట్లు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. ప్రధాన నిందితుడైన గ్యాంగ్స్టర్ వికాస్ దూబేకు స్థానిక పోలీసులే సాయం చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలినట్లు సమాచారం. ఈ ఎన్కౌంటర్లో వికాస్ దూబే ముఠా కీలకసభ్యుడు దయాశంకర్ అగ్నిహోత్రీ గాయాలపాలై పోలీసులకు దొరికిపోయాడు. అతన్ని అరెస్టు చేసి విచారించడంతో ఈ విషయం బయటపడింది.
దాదాపు 60కేసుల్లో నిందితుడిగా ఉన్న కరుడుకట్టిన రౌడీషీటర్ను పట్టుకునేందుకు యూపీ పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. అయితే, ఈ ప్రత్యేక బృందాలు బయలుదేరిన సమాచారాన్ని స్థానిక పోలీసులు గ్యాంగ్స్టర్కు తెలియజేసినట్లు పట్టుబడిన ముఠాలో సభ్యుడు దర్యాప్తులో వెల్లడించాడు. 'వికాస్ దూబేను అరెస్టు చేయడానికి వస్తున్నట్లు స్థానిక పోలీసుస్టేషన్ నుంచి సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన వికాస్ దూబే తన దగ్గరున్న ఏకే-47తో పోలీసులపై కాల్పులు జరిపాడు' అని దయాశంకర్ దర్యాప్తు అధికారులకు వివరించాడు. అంతేకాకుండా ఆ సమయంలో గ్రామంలో కరెంటు కూడా నిలిపివేయాలని స్థానిక పోలీసుల నుంచి విద్యుత్తు కేంద్రానికి ఆదేశాలు వెళ్లినట్లు దర్యాప్తులో బయటపడింది.
దీంతో స్థానిక చౌబేపూర్ పోలీస్ స్టేషన్ ఇన్చార్జ్ వినయ్ తివారీని సస్పెండ్ చేసిన యూపీ పోలీసులు అతన్ని విచారిస్తున్నారు. అంతేకాకుండా స్టేషన్లోని మొత్తం సిబ్బందిపై కన్నేసి ఉంచారు. స్థానికంగా ఓ వ్యక్తిని చంపేందుకు గ్యాంగ్స్టర్ ప్రయత్నిస్తున్నాడని ఫిర్యాదు అందినప్పటికీ స్థానిక ఇన్స్పెక్టర్ వినయ్ తివారీ కేసు పెట్టడానికి నిరాకరించినట్లు తెలిసింది. దీంతో ఆవ్యక్తి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి అరెస్టు చేసేందుకు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. ఈ సందర్భంగా గ్యాంగ్స్టర్ జరిపిన కాల్పుల్లో డిప్యూటీ ఎస్పీ దేవేంద్ర మిశ్రా సహా ముగ్గురు ఎస్సైలు, నలుగురు కానిస్టేబుళ్లు ప్రాణాలు కోల్పోయారు.
ఈ ఘటనను సవాల్గా స్వీకరించిన ఉత్తర్ప్రదేశ్ పోలీసులు నిందితుడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. మూడు రోజులైన నిందితుడి ఆచూకి లభించలేదు. తాజాగా అతన్ని పట్టించినవారికి లక్ష రూపాయల రివార్డును ప్రకటించారు. ఉత్తర్ప్రదేశ్ రాజధాని లఖ్నవూకు 150కి.మీ దూరంలో ఉన్న బిక్రూ గ్రామంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది. అయితే ఈ మాఫియాకు పోలీసులు గూఢచర్యం చేసినట్లు తేలితే కఠినచర్యలు ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు. ఇదిలాఉంటే, గ్యాంగ్స్టర్ ఇంటిని అధికారులు కూల్చివేశారు.
ఇవీ చదవండి..
నా కొడుకును కాల్చి చంపండి..!
రౌడీమూకల కాల్పుల్లో 8మంది పోలీసుల మృతి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో ముగ్గురి అరెస్ట్
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో అనిశా మరో ముగ్గురిని అరెస్టు చేసింది. ఆయన ఆస్తులకు బినామీలుగా ఉన్న వ్యాపారులు గోదావర్తి సత్యనారాయణమూర్తి(62), పెంట భరత్కుమార్(30), ప్రైవేటు ఉద్యోగి పెంట భరణికుమార్(30)ను వ్యవహరిస్తున్నట్లు గుర్తించింది. -
నూడుల్స్ ప్యాకెట్లలో వజ్రాలు
నూడుల్స్ ప్యాకెట్లలో దాచిపెట్టిన వజ్రాలు, ప్రయాణికుల శరీర భాగాల్లో, బ్యాగేజీలో ఉంచి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని ముంబయి విమానాశ్రయంలో కస్టమ్స్ విభాగం స్వాధీనం చేసుకుంది. -
వైకాపా నాయకుడి ఇంట్లో 384 మద్యం సీసాలు
శ్రీకాకుళంలోని కత్తెరవీధికి చెందిన వైకాపా నాయకుడు పైడి మహేశ్వరరావు నివాసంలో దాచి ఉంచిన 384 మద్యం సీసాలను టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. -
ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురికి గాయాలు
ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయిన బస్సు అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన ఘటన సూర్యాపేట జిల్లా మునగాలలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. -
అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్యాయత్నం
అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆ దంపతులు వాటిని తీర్చే దారిలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా భర్త మృతి చెందారు. ఈ విషాదకర ఘటన పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం పారుపల్లిలో జరిగింది. -
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
హైదరాబాద్ నగరంలోని యూసఫ్గూడలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక యువతిపై బస్సు ఎక్కడంతో తీవ్రగాయాలతో ఆమె మృతిచెందింది.